దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి గా మాజీ ముఖ్యమంత్రి , తమిళనాడ్ గవర్నర్ రోశయ్య ఒక సంవత్సరం పాటు సీఎంగా చేశారు. ఆ తరువాత రాష్ట్ర ఉన్న సమస్య వలన రోశయ్యను తప్పించి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీక చేసింది. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ సీఎంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు అనేక పథకాలు, ప్రవేశపెట్టిన సీఎంగా పేరు తెచ్చుకున్నారు. కిలో బియ్యం ఒక్క రూపాయికి ఇచ్చి అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. ఇందిరమ్మ బాట పేరుతో రాష్ట్రంలో అడపదపా తిరుగుతున్న ముఖ్యమంత్రికి మరో పథకాని తెరతీశారు. రాష్ట్రంలో నేత్ర సమస్యలున్న బడి ఈడు పిల్లలందరికీ కళ్లజోళ్ల పంపీణీ కార్యక్రమం ‘చిన్నారి చూపు’ పేరుతో ప్రారంభించారు. పబ్లిగ్ గార్టెన్స్ లోని లలిత కలాతోరణంలో రాజీవ్ విద్యామిషన్ , వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం 200 మంది పిల్లలకు లాంఛనంగా కళ్లజోళ్లను అందించారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలకు ప్రాథమికంగా కంటి పరీక్షలు నిర్వహించామని ఆయన చెప్పారు. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ముఖ్యమంత్రి ఈ చిన్నారి చూపు పథకం పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 4లక్షల 7వేల మంది చిన్నారులకు కంటి సమస్యలున్నట్లు ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే వీరిలో ఇప్పటి వరకు 6 వేల మందికి శాస్త్ర చికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించినట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ చిన్నారి చూపు పథకం జనవరి 31 నుండి మండల స్థాయిలో కూడా నిర్వహిస్తామని సీఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ చిన్న పిల్లల పట్ల శ్రద్ద చూపటంపై రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more