సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ మళ్ళీ మణిరత్నం దర్శకత్వంలో నటించబోతున్నారా ? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. ఎప్పుడో 1991 సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘తలబది ’ రజినీకాంత్ కెరియర్ లోనే ఓ మైలురాయిగా నిలిచింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్నట్లు వార్తలు. ప్రస్తుతం మణిరత్నం తీస్తున్న ‘కడలి ’ చిత్రం తరువాత వీరిద్దరి సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు. కొత్త సినిమాకు సంబంధించి వీరిద్దరూ కలిసి చర్చించుకున్నట్లు, త్వరలోనే దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు మణిరత్నం ఓ స్టోరీ లైన్ ని రజనీకాంత్ కి చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఓ తమిళ నిర్మాణ సంస్థ నిర్మించనున్నారని, రజినీకాంత్ ఇప్పటి వరకు చేసిన చిత్రాకలంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తారని అంటున్నారు.
రజనీకాంత్ కి సరపడ మాస్ ఇమేజ్ ని, తనదైన క్లాస్ స్టైల్ లో మరోసారి ఆవిష్కరించనున్నారని అంటున్నారు. ఇక మణిరత్నం చిత్రం అనగానే మార్కెట్ వర్గాల్లో అప్పుడే కలకలం మొదలైంది. ఓ రేంజిలో బిజినెస్ జరుగుతుందో అని ట్రేడ్ లో లెక్కలు వేసుకుంటున్నారు. ఇక తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన 'విక్రమసింహా'సంక్రాంతిరోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ నటించిన 'విక్రమసింహ'ను 12-12-12 అనే అరుదైన తేదీన తెరపైకి తీసుకురావాలనుకొన్నారు . ఏది ఏమైనా మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం నిజంగా సంతోషించాల్సిన విషయమే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more