ఎఫ్ డీఐలపై పార్లమెంటులో ప్రతిష్టంభన తొలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కీలక తరుణంలో మిత్ర పక్షాలు బాసటగా నిలవడంతో ప్రభుత్వ వాదనకి మరింత మద్దతు చేకూరింది. దీంతో తాము ఓటింగ్, దేనికైనా రెడీ అని ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. అయితే ఏ నిబంధన కింద జరగాలన్నది స్పీకర్ విచక్షణాధికారం కాబట్టి, నిర్ణయాన్ని ఆమెకే వదిలి వేస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమలనాథ్ తెలిపారు.నాలుగవ రోజు కూడా ఎటువంటి సభా కార్యక్రమాలు జరగకుండా ఉభయ సభలు వాయిదా పడినా, ప్రభుత్వం తన మాట నెగ్గించుకునే దిశలో గొప్ప ముందడుగు సాదించింది. ఎప్ఢ్ఐలపై తలెత్తిన గందరగోళంతో అసలు పార్లమెంటు నడుస్తుందా అన్న అనుమానాలు కలిగినా... చివరికి ప్రభుత్వం పై చేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్రపక్షాలు కూడా ఎదురు తిరగడంతో...,ఈ సారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదామనుకున్న విపక్షాల పాచికలు పారేలా లేవు. అఖిలపక్ష సమావేశం అనంతరం.., ఎస్పీ, బీఎస్పీలు మెత్తబడగా..., తాజాగా యూపీఏ భాగస్వామ్య పక్షాల భేటీ అనంతరం డీఎంకే ప్రభుత్వానికి దన్నుగా నిలిచింది. ప్రభుత్వాన్ని పడదోసి అధికారంలోకి రావడమే ప్రతిపక్ష బీజేపీ లక్ష్యమని..., మతతత్వ శక్తులని అడ్డుకునేందుకు ఇష్టం లేకున్నా తాము ప్రభుత్వానికి మద్దతు పలుకుతామని డీఎంకే అధినేత కరుణానిధి ప్రకటించారు. దాంతో యూపీఏ భాగస్వామ్య పక్షాల్లో ఎప్ఢ్ఐలపై ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో ఓటింగ్ కైనా సిద్దమని ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమలనాథ్ సైతం తాము అన్నింటికీ సిద్దంగా ఉన్నామన్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం స్పీకర్్దేనని చెప్పారు. ప్రభుత్వం తరపున..., పార్లమెంటులో మెజారిటీ అభిప్రాయాన్ని స్పీకర్్కి తెలియజేస్తామని..., మెజారిటీ పార్టీలు పాలనాపరమైన నిర్ణయంపై ఓటింగ్ తో కూడిన చర్చ అవసరం లేదని అభిప్రాయపడుతున్నాయని..., అయితే తుది నిర్ణయం స్పీకర్ దేనని చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more