కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి లండన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. మంత్రి చిరంజీవి కొన్ని నిజాలను బయట పెట్టినట్లు తెలుస్తోంది.వరంగల్లో జరగనున్న కాకతీయ ఉత్సవాలకు కేంద్ర నిధులు కావాలంటూ తమకెవరూ ప్రతిపాదనలు పంపలేదని, తనంతట తానుగానే ఉత్సవాలకు నిధులు మంజూరు చేశానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె.చిరంజీవి స్పష్టం చేశారు. కాకతీయ ఉత్సవాలకు కేంద్రం రూ.25 కోట్లు మంజూరు చేయాలంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన డిమాండ్ను గుర్తు చేయగా చిరంజీవి పైవిధంగా స్పందించారు. ‘‘ఉత్సవ నిర్వాహకులు నిధులు కావాలని ప్రతిపాదన ఇవ్వలేదు. నా అంతట నేనే రూ.25 లక్షలు మంజూరు చేశా. నిజానికి ఉత్సవాలకు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు కేంద్రం నుంచి ఇస్తారు. కానీ నేను మాత్రం రూ.25 లక్షలు ఇచ్చాను’’ అని ఆయన పేర్కొన్నారు. రామప్ప దేవాలయ ముఖద్వారం కూలిన విషయాన్ని గుర్తుచేయగా.. అది తన పరిధిలోకి రాదని, సాంస్కృతిక శాఖ పరిధిలోకి వస్తుందని చిరంజీవి చెప్పారు. తన తొలి విదేశీ పర్యటన విజయవంతమైందని, మొత్తం మూడు విభాగాల్లో భారత్కు ప్రపంచ పర్యాటక సంస్థ అవార్డులు దక్కాయని తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా 2.5 కోట్ల మందికి ఉపాధి దక్కే అవకాశముందని వివరించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. త్వరలోనే ‘ఇన్క్రెడిబుల్ ఇండియా ఫేజ్-2’ను ప్రారంభిస్తామన్నారు. దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా ‘గో బియాండ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. దక్షిణాసియా పర్యాటక శిఖరాగ్ర సమావేశాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లో నిర్వహిం చనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి 180 దేశాలు హాజరవుతాయన్నారు. భారత పర్యటనకు వచ్చే టూరిస్టులకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా చూసేందుకు వివిధ శాఖలతో మాట్లాడాల్సి ఉందన్నారు
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more