63 సంవత్సరాల యువకుడు , 36 సంవత్సరాల యువతి రాష్ట్రంలో పాదయాత్రల జోరు పెంచారు.చంద్రబాబు పాదయాత్రకు రంగారెడ్డి జిల్లాలో కూడా మంచిస్పందన వస్తోంది. పాలమూరు లో యాత్ర ముగించుకుని రంగారెడ్డి జిల్లాకు వచ్చిన బాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మొదటి రోజు పరిగి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలన కంటే బ్రిటీష్ పాలనే నయమని సర్కారుపై విమర్శలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో ముగిసింది. పాలమూరులోని 14 రోజులు పాదయాత్ర చేసిన చంద్రబాబు 5 నియోజక వర్గాల ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. చివరిరోజు కోయిల్ కొండ మండలం శేరి వెంకటాపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన బాబు లింగాలచేడు, సూరారం, మల్లాపూర్, కొత్లాబాద్ లో రైతులు, మహిళలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు.
రంగా రెడ్డి జిల్లా పగిడ్యాల కు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. జిల్లా టీడీపీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రత్నం తదితరులు బాబు వెంట నడిచారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను అసెంబ్లీ ముందుంచుతామని నేతలు చెప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా పాదయాత్రలో మొదటి రోజు చంద్రబాబు పగిడ్యాల, బులుసూరుకొండ, భవాని టెంపుల్ తాండ ల్లో పర్యటించారు. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగారు. టీడీపీ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బ్రిటేష్ పాలనే నయమని చెప్పుకొచ్చారు. బ్రిటిష్ పాలకులు కొంచెం దోచుకెళితే కాంగ్రెస్ నేతలు దేశ సంపదను దోచుకోని విదేశాల్లో పెడుతున్నారని విమర్శించారు. సీఎం పర్యటనను అడ్డుకోని టీఆర్ఎస్ నేతలు టీడీపీ సభల్లో ఎందుకు గొడవలు పెడుతున్నారని మండిపడ్డారు. తాను ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపడితే ఇతర పార్టీల నేతలు పార్టీ బలోపేతానికి యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ జైళ్లో ఉండే ఎమ్మెల్యేలను కొంటున్నాడని దుయ్యబట్టారు.రంగారెడ్డి జిల్లా పాదయాత్రలో భాగంగా చంద్రబాబు ఇవాళ చంద్రబాబు 16.5 కి.మీలు పాదయాత్ర చేయనున్నారు. ముసునూరు నుంచి ప్రారంభమయ్యే యాత్ర... రెడ్డిపల్లిగేటు, గండేడు, అంచనా పల్లి, బొమ్మిరెడ్డి పల్లి, నన్చర్ల గేటుల మీదుగా సాగనుంది.
షర్మిల పాదయాత్ర కర్నూలు జిల్లాకు చేరుకుంది. అనంతపురం నుంచి కర్నూలుకు చేరిన షర్మిలకు జిల్లా వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో రైతుల సమస్యలు తెలుసుకున్న షర్మిల... ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. సర్కారు రైతుల సంక్షేమాన్ని మరిచిందని ఘాటుగా విమర్శించారు. వైఎస్ జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయత్ర అనంతపురం జిల్లాలో ముగిసింది. చివరి రోజు గుంతకల్లులోని టీటీడీ కళ్యాణ మండపం నుంచి యాత్ర ప్రారంభించిన షర్మిల కసాపురం మీదుగా.. కర్నూలుజిల్లా మద్దికెరకు చేరుకున్నారు. మద్దికెరలో టమోటారైతులను పరామర్శించి.. ఆమె రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కిరణ్ సర్కారు... రైతులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మద్దికెరలో నిర్వహించిన సభలో షర్మిల టీడీపీ అధ్యక్షడు చంద్రబాబుపై విమర్శలు సంధించారు. అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబే పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు.పరిపాలనలో విఫలమయిన ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. జగన్ కాంగ్రెస్ లో ఉంటే.. మంత్రి పదవితోనే సరిపెట్టే సర్కారు తన అన్నయ్య ప్రజల పక్షాన నిలబడినందుకే జైలులో పెట్టించిందని షర్మిల విమర్శించారు. త్వరలో రాజన్న పాలన వస్తుందని అన్నదాతలకు భరోసా ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more