నల్లగొండ జిల్లా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జిల్లా పరిధిలోని మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించడంతో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపోందిన కోమటిరెడ్డి రాజమోహన్ రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీ సభ్యత్వంతో పాటు అసెంబ్లీ శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.
మూడు ప్రధాన పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ ఉపఎన్నికల కోసం ఇప్పటికీ అభ్యర్థులు ఖరారు కాకపోయినా.. త్రిముఖ పోటీ మాత్రం నెలకొంది. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని ఖరారు చయగా, బీజేపి నుంచి కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవనున్నారు. కాగా రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ అక్కడ అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయినా ప్రచారం మాత్రం పార్టీ తరపున కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నది.
ఈ నెల 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14న నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనున్నది. 15న నామినేషన్లను పరిశీలించనుండగా.. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. నవంబర్ 3న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. 6న ఓట్లను లెక్కించనున్నారు. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇందులో రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గానికి ఎన్నిక జరుగనున్నది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more