సంచనలం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం జువైనల్గా పరిగణించాలని పేర్కొంది. జువైనల్ సెక్షన్ 15 ప్రకారం.. నలుగురు మేజర్లుగా బోర్టు అంచనాకు వచ్చింది. నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని న్యాయస్థానం భావించింది. మానసిక నిపుణులతో పాటు బోర్డు సభ్యుల నివేదికను ట్రయల్ కోర్టు సమీక్షించింది.
ఈ ఏడాది మే 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్కు వచ్చిన రొమేనియా మైనర్ బాలికపై సాదుద్దీన్ అనే యువకుడితో పాటు ఐదుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టగా.. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా.. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది.
నిందితుల్లో రాజకీయ, ఉన్నత వర్గాలకు చెందిన వారి కుమారులున్నారు. ఈ కేసులో నిందితులకు జువెనైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను మేజర్లుగా పరిగణిస్తే.. వారికి సైతం శిక్షలు పడే అవకాశం ఉంటుందని పోలీసులు విచారణ సమయంలో తెలిపారు. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మైనర్లు అయినప్పటికీ.. నేరం మాత్రం ఆ స్థాయిది కానందున మైనర్లుగా పరిగణించి, శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ క్రమంలోనే కోర్టు నలుగురు నిందితులను మేజర్లుగా గుర్తించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more