‘‘దేవుడు పిల్లుస్తున్నాడు.. వెళ్తున్నా..’’ అంటూ ఓ యుక్తవయస్సుతోని నవయువకుడు తన స్వగ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ పాపపు లోకములో ఉండాల్సిన అవసరం లేదని రమ్మని శివయ్య పిలుస్తున్నాడు. ఈ జీవితాన్ని సమాస్తం చేసుకుంటేనే కనీసం వచ్చే జన్మలోనైనా లోకాన్ని మార్చేలా ఉన్నతమైన జీవితాన్ని శివయ్య కల్పించాలని తాను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ తన తండ్రి కూడా శివ భక్తుడని, ఆయనను కూడా కొన్నేళ్ల క్రితం శివయ్య తనలో ఐక్యం చేసుకున్నాడని, అందుకనే తాను శివయ్య లోకానికే వెళ్తున్నానని పేర్కోంటూ ఓ లేఖ రాశాడు.
తన మరణానికి ఎవరూ బాధ్యులుకారని, తనను శివయ్య పిలవడంవల్లే తాను వెళ్తున్నానని చెబుతూ ఓలేఖ రాశాడు. అయితే తన చిన్నారి చెల్లి శ్రీలక్ష్మీని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని ఆ లేఖలో తన బంధువులను కోరాడు. కాగా యువకుడి తల్లి అతని ఆకాల మరణంతో కన్నీరు మున్నీరైంది. తండ్రి మరణానంతరం కుటుంబ బాధ్యతను తన భుజాలపై ఎత్తుకున్న యువకుడు మళ్లీ తమను ఒంటరిని చేసి వెళ్లిపోయాడని అమె గుండెలవిసేలా రోధించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పెద్దరావీడు మండల పరిధిలోని చట్లమడ ఆమ్మెల్ గ్రామంలో చోటుచేసుకుంది.
కాగా వెంకట పూర్ణ శేఖర్ రెడ్డి అనే యువకుడు తన కుటుంబాన్ని పోషించేందుకని తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడని.. అలాంటి యువకుడు అనుకోకుండా స్వగ్రామానికి వచ్చి తన ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే యువకుడు లేఖలో రాసినట్లుగానే ఆ కుటుంబం శివయ్యను ఆరాధిస్తోంది. కాగా, ఆయన కొన్నేళ్ల కిత్రమే మరణించడంతో ఉన్నత విద్యను మానేసిన యువకుడు కుటుంబ పోషణ నేపథ్యంలో చెన్నైకి వెళ్లి ఉద్యోగం చేసి.. తల్లిని, చెల్లికి పట్టెడన్నం పెట్టాడు. అలాంటిది ఆకస్మాత్తుగా తిరిగివచ్చి ఇలా విపరీత నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటన్నది తేలియలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more