కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన ముఖ్యమంత్రి హయాంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై న్యాయస్థానం దర్యాప్తునకు ఆదేశించింది. యడ్డ్యూరప్ప అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై బెంగళూరు కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు అనేక కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారంటూ దాఖలైన ప్రైవేటు పిటిషన్ను విచారించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది.
అయితే ఈ దర్యాప్తును నిర్ణీత గడవులో పూర్తిచేసి.. తుది నివేదిక ఇచ్చేందుకు నవంబర్ 2 వరకు గడువు ఇచ్చింది. అదే రోజున తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త 2021 జూన్లో దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దానిని విచారిస్తూ ఈ మేరకు అదేశాలను వెలువరించింది. సీఎంగా ఉన్న సమయంలో యడ్డ్యూరప్ప.. కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకుని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ(బీడీఏ) పరిధిలోని హౌసింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టును రామలింగం కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు.
ఈ అవినీతి ముడుపుల విషయంలో యడ్యూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర, కుమార్తె పద్మావతి బంధువు శశిధర్ను నిందితులుగా పేర్కొన్నారు. అయితే.. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తొలుత అబ్రహం పిటిషన్ను కొట్టివేసింది. దీనిపై ఆయన హైకోర్టు ఆశ్రయించారు. టీజే అబ్రహం పిటిషన్ను పునఃపరిశీలించాలని రాష్టోన్నత న్యాయస్థానం ఆదేశించగా.. స్పెషల్ కోర్టు మరోసారి విచారణ జరిపింది. యడ్యూరప్ప, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో పదవులు పోయి ఇబ్బందులు పడుతున్న ఆయన చుట్టూ తాజాగా కేసులు చుట్టుముడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more