Congress Collapses In Goa: 8 Of 11 MLAs Join BJP గోవా: 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్.!

Eight goa congress mlas join bjp in the presence of chief minister pramod sawant

Goa,Goa news, Goa latest news, Goa political crisis, political crisis in Goa, Goa cm pramod sawant, Goa bjp MLAs, Goa Congress MLAs, Congress MLAs to join BJP,Congress MLAs to join BJP in Goa, Sadanand Tanavade,Sadanand Tanavade Goa,Goa Assembly news,goa assembly BJP ,BJP seats in Goa,Goa congress split,Goa congress split news,michael lobo,Digambar Kamat, goa congress defection, bjp goa, goa assembly election 2022,goa news today,congress goa

Goa Chief Minister Pramod Sawant, said eight MLAs of Congress have joined the ruling BJP unconditionally. Addressing a press conference with State BJP chief Sadanant Shet Tanavade, Mr. Sawant said that BJP’s strength in the 40-member Assembly has gone up to 28 with the eight new entrants.

గోవా కాంగ్రెస్ కు భారీ షాక్.. 8 మంది ఎమ్మెల్యేలకు బీజేపీలోకి జంప్.!

Posted: 09/14/2022 03:47 PM IST
Eight goa congress mlas join bjp in the presence of chief minister pramod sawant

కాంగ్రెస్ అగ్రనేత, వాయినాడ్ పార్లమెంటరీ సభ్యుడు, పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీని పటిష్టపర్చేందుకు బారత్ జోడో అంటూ కన్యాకుమారీ నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న తరుణంలో.. ఆ పార్టీకి గోవాలో కొలుకోలేని దెబ్బ తగిలింది. రాహుల్ పాదయాత్రతో పాపులారిటీ సంపాదించుకునే ప్రయత్నాలకు గండిపడింది. గోవా మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపిలో చేరారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్​.. కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు సావంత్.

"భారత్ జోడో అంటూ కాంగ్రెస్ యాత్ర ప్రారంభించింది. కానీ, గోవాలో 'కాంగ్రెస్ ఛోడో' కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపిలో చేరుతున్నారు" అని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఎమ్మెల్యేలు సీఎం, అసెంబ్లీ స్పీకర్​తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ శాసనపక్షాన్ని బీజేపిలో విలీనం చేయాలని ఎమ్మెల్యేలు తీర్మానించారు. విపక్ష నేతగా ఉన్న మైఖెల్ లోబో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీన్ని మాజీ సీఎం, ఎమ్మెల్యే దిగంభర్ కామత్ బలపర్చగా.. మిగితా ఎమ్మెల్యేలు ఆమోదించారు. అనంతరం, సీఎం ప్రమోద్ సావంత్​తో కలిసి ఎమ్మెల్యేలు చిత్రాలు దిగారు. ఈ ఫొటోలు వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

పార్టీ మారిన వారిలో లోబో, కామత్​తో పాటు.. దెలిలా లోబో, రాజేశ్ ఫల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సియో సెక్వీరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్​లు ఉన్నారు. గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ బీజేపి 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గిన నేపథ్యంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది బీజేపిలో చేరిపోయారు. మూడింట రెండొంతుల మంది పార్టీని వీడిన నేపథ్యంలో... ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వీరు తప్పించుకున్నారు.

కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని రెండు నెలల క్రితమే వార్తలు వచ్చాయి. గోవా అసెంబ్లీ సమావేశానికి ఒక రోజు ముందు కాంగ్రెస్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేయగా.. ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. త్వరలోనే వారంతా బీజేపిలో చేరతారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ను రంగంలోకి దింపి నాటి సంక్షోభం సద్దుమణిగేలా చూశారు. ఇక 2019లో 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మంది బీజేపిలో చేరారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టిన తరుణంలో తాజా పరిణామాలు పార్టీకి గట్టిదెబ్బే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles