ఆ దంపతులు దాదాపు 10 ఏళ్లుగా ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. కాసింత డబ్బులు కూడబెట్టుకున్నారు. ఇకనేం కొత్తగా ఏమైనా చేయాలని భావించి.. అందుకు తగ్గట్టుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాముంటున్న ఇంటి మరమ్మత్తు చేయాలన్నదే ఆ నిర్ణయం. అయితే ముందుగా వంటింటికి మరమ్మతు చేయాలని భావించారు. దశాబ్దాల కాలం నాటి ఇల్లు అందులోనూ.. ఏకంగా పదేళ్లుగా అక్కడే ఉంటున్నారు. దీంతో తాము కూడబెట్టుకున్న దాని నుంచి ఇంటి కోసం కాస్త వెచ్చిద్దామని భావించారు. ఇకనేం అనుకున్నదే తడవుగా ఇంటి మరమత్తు పనులను చేపట్టారు. అంతే ఆ ఒక్క నిర్ణయం వారిని కోటీశ్వరులను చేసింది.
అదెలా అంటే మరమ్మతులలో భాగంగా వంటింట్లో ఉన్న ఓ గోడను కూల్చారు. అంతే ఆ గోడలోంచి వచ్చిన నిధులు వారి జీవితాలలో అలుముకున్న చీకట్లు పారద్రోలి కాంతులను నింపేసింది. నిజంగా ఇళ్లు కలసిరావడం అంటే ఇది కాక మరేమిటీ.? దీంతో ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ కు చెందిన దంపతులు గత పదేళ్లుగా నార్త్ యార్క్షైర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో కాపురం చేస్తున్నారు. ఏళ్లు గడవటంతో ఆ ఇల్లు ప్రస్తుతం పాతదైపోయింది. ఈ క్రమంలోనే ఆ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వంట గదిని కూల్చేసి.. సకల సౌకర్యాలతో తిరిగి నిర్మించాలని భావించారు.
ఈ నేపథ్యంలోనే కూల్చివేతను ప్రారంభించారు. గదిలోని ఓ గోడను బద్దలు కొడుతున్న సమయంలో కోట్ల విలువ చేసే బంగారు నాణేలతో కూడిన నిధి బయటపడింది. అది చూసి ఆ భార్యభర్తలు షాకయ్యారు. సుమారు 400ఏళ్లనాటి 264 బంగారు నాణేలను గుర్తించి తొలుత కంగుతిన్నారు. ఆ తర్వాత పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేశారు. ఈ బంగారు నాణేలను వేలం ద్వారా విక్రయించాలని ఆ దంపతులు భావిస్తున్నారు. వాటిని విక్రయించడం ద్వారా సుమారు రూ.2.3 కోట్ల రూపాయలు పొందొచ్చని లెక్కలు వేస్తున్నారు. కాగా.. ఇంటి గోడలో నిధి బయటపడ్డ విషయం స్థానికంగా హాట్ టాపిక్గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more