వినాయక నవరాత్రులు ఇవాళ్టితో ముగియడంతో రేపు గణేశుడి లడ్డూల వేలం అనంతరం నిమజ్జనానికి హైదరాబాద్ నలుమూలల నుంచి గణనాధులు బయలుదేరి హుస్సేస్ సాగర్ కు చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం నుంచి గణనాదులు గంగమ్మ ఒడికి చేరుకునే సామూహిక నిమజ్జన ప్రక్రియ ప్రారంభంకానుంది. అయితే నిమజ్జనానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ట్రాఫిక్ ను దారి మళ్లించడంతో పాటు పలు రహదారులు, ఫ్లైఓవర్లపై నుంచి వాహనాల రాకపోకలను నిషేధించింది. మరీముఖ్యంగా వినాయకుల ఊరేగింపు జరిగే ప్రాంతాలు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో కొనసాగనున్నాయి. ఇవి మరుసటి శనివారం ఉదయం వరకు అమల్లోఉంటాయి.
ఇక గణనాధుల ఊరేగింపు, నిమజ్జనం ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ఎలాంటి వాహనాలకు అనుమతించమని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో జరిగే వినాయక నిమజ్జనానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఉండటంతో అందుకు తగినట్లుగానే ఘనంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ లో జరిగే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి చూడటానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వినాయక నిమజ్జనం విషయంలో భాగ్యనగర్ ఉత్సవకమిటీకి ప్రభుత్వానికి మధ్య కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతుండగా ప్రభుత్వం దానికి ముగింపు పలికింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి అనుమతి ఇవ్వమని చెప్పడంతో ఈ వివాదం రాజుకుంది.
అయితే వెనక్కి తగ్గిన ప్రభుత్వం ట్యాంక్బండ్పై క్రేన్లు ఏర్పాటు చేయడంతో ఈ సమస్యకు చెక్ పడింది. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, విద్యాసంస్థలు, ప్రైవేటు వ్యాపార సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిమజ్జనం సందర్భంగా అనేక రహదారులపై వాహనాల రాకపోకలకు ఆంక్షలు ఉండటం కారణంగా సెలవును ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9న హైదరాబాద్ నగరవ్యాప్తంగా సెలవు ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీచేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాల్లో సెలవు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more