కరోనా తరువాత రోజుల నుంచి అత్యధిక ధరలతో అల్లాడిపోతున్న జనంపై ఇటు కేంద్ర పెట్రోలియం శాఖ కూడా కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా కొంత ఉపశమనం కల్పించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.91.5 మేర తగ్గించినట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఇది నిజంగా వాణిజ్య సిలిండర్ వినియోగించే వారికి గొప్ప ఊరట కలిగించే విషయమే. ఈ కొత్త ధరలు గురువారం (సెప్టెంబర్ 1) నుంచి అమల్లోకి రానున్నాయి.
ధర తగ్గిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో గతంలో రూ.1976గా ఉన్న 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు రూ.1885కే రానుంది. ఇక హైదరాబాద్లో ఈ సిలిండర్ ధర రూ.2099కి తగ్గింది. వరంగల్లో రూ.2141గా, విజయవాడలో రూ.2034గా, విశాఖపట్నంలో రూ.1953గా ఉంది. వాణిజ్య సిలిండర్ ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ సిలిండర్ ధరను తగ్గించడం ఇది వరుసగా ఐదోసారి కావడం విశేషం. అయితే కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. ఉపశమనం కేవలం ఆయా వినియోగదారులకు మాత్రమే పరిమితం చేసింది.
డొమెస్టిక్ సిలిండర్ ధరను మాత్రం అలాగే ఉంచాయి. నెల రోజులుగా డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు లేవు. ఆగస్ట్ 1న హైదరాబాద్లో 14.2 కేజీల సిలిండర్ రూ.1105గా ఉండగా.. ఇప్పుడూ అంతే ఉంది. చివరిసారి జులై 6వ తేదీని ఈ సిలిండర్ రూ.50 పెంచారు. ఆ తర్వాత ఇందులో హెచ్చుతగ్గులేమీ లేకుండా స్థిరంగా ఉంటోంది. నిజానికి ప్రతి నెలలో ఈ సిలిండర్ల ధరలను రెండుసార్లు సవరించే అవకాశం ఆయిల్ కంపెనీలకు ఉంటుంది. ప్రతి 15 రోజులకోసారి సిలిండర్ ధర పెంచడం లేదా తగ్గించడం చేస్తాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరను చాలా రోజులగా సవరించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more