విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దన క్రమంలో ఇక త్వరలోనే ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 31 వ తేదీ నుంచి అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానయాన సంస్థ విజయవాడ నుంచి షార్జాకు అంతర్జాతీయ విమాన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వారానికి రెండు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ముందుకు వచ్చింది. షెడ్యూల్ ప్రకటించడమే కాదు టికెట్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు.
దీంతో దాదాపు మూడున్నరేళ్ల తరువాత విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పూర్తి స్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వందే భారత్ మిషన్లో భాగంగా ఇక్కడి నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. విజయవాడ-షార్జా మధ్య ఎక్స్ప్రెస్ విమాన సేవలు ప్రతి సోమవారం, శనివారం ఉంటాయి. 186 మంది ప్రయాణీకుల బోయింగ్ 737-800 విమానం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.40 గంటలకు షార్జా నుంచి బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇక్కడ సాయంత్రం 6.35 గంటలకు బయలుదేరి రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుతుంది.
విజయవాడ నుంచి షార్జాకు ప్రారంభ టిక్కెట్ ధర రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీసు ప్రారంభమైతే అరబ్ దేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇటీవల విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయడంతో ఇక్కడి నుంచి విదేశాలకు పూర్తి స్థాయిలో సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. యూఏఈలోని షార్జాతో పాటు దుబాయ్, అబుదాబి, అజ్మాన్, పుజిరా, రస్ అల్ ఖైమా నుంచి ఇక్కడికి ప్రయాణించడం సులభతరం అవనున్నది.
అలాగే, గల్ఫ్లోని అనేక దేశాలకు వెళ్లడానికి షార్జా నుంచి సులభమైన కనెక్టివిటీ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. భవిష్యత్లో ప్రయాణీకుల డిమాండ్కు తగినట్లుగా దుబాయ్, కువైట్ నుంచి పూర్తి స్థాయి విమాన సర్వీసులను నడపడానికి వివిధ విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. విజయవాడ విమానాశ్రయానికి 2017 మే నెలలో అంతర్జాతీయ హోదాను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, పలు సాంకేతిక కారణాలతో 2019 లో విజయవాడ-సింగపూర్ మధ్య వారానికి ఒక సర్వీసు నడిచే సర్వీసును 6 నెలలపాటు రద్దు చేశారు. ప్రస్తుతం మస్కట్కు వారానికి ఒక సర్వీసు, అలాగే షార్జా, కువైట్, మస్కట్ నుంచి వారానికి ఐదు సర్వీసులు మాత్రమే ఇక్కడి నుంచి నడుస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more