అందుగలడు ఇందుగలడన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా కనిపించు శ్రీహరి అన్న విధంగా.. ప్రస్తుత ప్రపంచంలో ఎందెందు వెతికినా కనిపించు ఆన్లైన్ మోసాలు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిత్యం కొన్ని లక్షల మంది ఈ మోసాలకు బాధితులుగా మారుతున్నారు. ఇక ఈ మోసాలు నానాటికీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు పిన్ నెంబరు పసిగట్టి.. ఆ తరువాత సందేశాలు, ఆ తరువాత ఈ మెయొల్.. ఆ తరువాత స్మార్ట్ ఫోన్, ఆతరువాత ఫేస్ బుక్, ఇక తాజాగా వాట్సాఫ్ ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో రిటైర్డ్ టీచర్ నుంచి ఓ కేటుగాడు ఇదే తరహాలో రూ 21 లక్షలు మోసగించాడు.
మదనపల్లె పట్టణంలో రెడ్డెప్పనాయుడు కాలనీ నివాసి, రిటైర్డ్ టీచర్ వరలక్ష్మి తన ఖాతా నుంచి నగదు విత్డ్రా అయినట్టు మెసేజ్ రావడంతో ఆమె స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని కాంటాక్ట్ నుంచి వచ్చిన వాట్సాప్ లింక్ను ఆమె క్లిక్ చేసిన వెంటనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు విత్డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. ఒక్కసారిగా ఆమె ఖాతా నుంచి రూ 21 లక్షలు డెబిట్ అయ్యాయి. స్కామర్లు ఆమె ఖాతాను హ్యాక్ చేసి మొత్తం నగదును లూటీ చేసిన తర్వాత వరలక్ష్మి సైబర్ క్రైమ్కు సమాచారం అందించారు. వాట్సాప్ లింక్ను క్లిక్ చేసిన తర్వాత ఆమె ఖాతాలో నగదు మాయమైందని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
వాట్సాప్ లింక్స్ ద్వారా సైబర్ నేరాలు ఇటీవల పెరిగాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లింక్లపై యూజర్లు క్లిక్ చేసిన వెంటనే స్కామర్లు బాధితుల ఫోన్, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేసి లూటీలకు పాల్పడుతున్నారని చెప్పారు. గుర్తుతెలియని నెంబర్, వ్యక్తుల నుంచి వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని, యూఆర్ఎల్ను సరిగ్గా చెక్ చేసుకుని అది సరైన లింక్ అని నిర్ధారణకు రావాలని సూచిస్తున్నారు. నగదు ప్రయోజనాలు కల్పించేలా ఉండే లింక్లు, మెసేజ్లను క్లిక్ చేయరాదని, వాటిని షేర్ చేయరాదని పోలీసులు కోరుతున్నారు. అలాంటి మెసేజ్లను స్కామర్లే ఎక్కువగా పంపిస్తుంటారని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more