దేశంలో నానాటికీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు.. నిరుద్యోగం. రైతు ఉత్పాదనలపై జీఎస్టీ వర్తింపులను నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ దేశవ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు నలుపు రంగు దుస్తుల్లో ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివసించే రాష్ట్రపతి భవన్ లను ఘెరావ్ చేయాలని పిలుపునిచ్చి.. నిరసన ప్రదర్శన చేపట్టారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు తలపెట్టిన ఈ ఆంధోళనలో భాగంగా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి ఇవాళ సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు నల్ల దుస్తులు వేసుకుని మరీ అందోళనలో పాల్గోన్నారు. రాహుల్ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకోగా, ప్రియాంకా బ్లాక్ సూట్ వేసుకున్నారు. ప్రధాని మోదీని హిట్లర్తో పోల్చారు రాహుల్. హిట్లర్ కూడా ఎన్నికలు గెలిచాడని, అతను ఎలా గెలిచాడనుకుంటున్నారు, జర్మనీలోని అన్ని ప్రభుత్వ వ్యవస్థల్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడని, నాకు వ్యవస్థను పూర్తిగా అప్పగిస్తే, అప్పుడు ఎన్నికలు ఎలా గెలవాలో చూపిస్తానని రాహుల్ అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రియాంకా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
రాహుల్ గాంధీ ఇవాళ మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ఖూనీని తిలకిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. శతాబ్ధం క్రితమే ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన ఇండియాను మన కండ్ల ముందే నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు. నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా పోరాటం చేసినవాళ్లను దారుణంగా అటాక్ చేస్తున్నారని, జైలులో వేస్తున్నారని రాహుల్ విమర్శించారు. తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, నిరుద్యోగం పెరిగిందని, సమాజంలో హింస కూడా అధికమైనట్లు రాహుల్ అన్నారు.
కానీ వీటి గురించి మాట్లాడకుండా ప్రభుత్వం విపక్షాలను అణిచివేస్తోందన్నారు. కేవలం నలుగురు లేదా అయిదుగురి ప్రయోజనాల కోసం ప్రభుత్వం నడుస్తోందని, ఇద్దరు ముగ్గురు చేసిన వ్యాపారానికి ప్రభుత్వం అండగా ఉంటుందోని ఆరోపించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు ఇవాళ ప్రధాని ఇంటిని చుట్టుమట్టనున్నారు. ఇక లోక్సభ, రాజ్యసభ ఎంపీలు చలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రతి ప్రభుత్వ సంస్థ ఆర్ఎస్ఎస్ ఆధీనంలోకి వెళ్లిపోయినట్లు ఆరోపించారు. తమ ప్రభుత్వ సమయంలో మౌళికసదుపాయాలు తటస్థంగా ఉండేవని, కానీ ఇప్పుడు ఒకే పార్టీ తరపున ప్రభుత్వ సంస్థలు ఉన్నట్లు తెలిపారు. స్టార్టప్ ఇండియాతో చాలా మంది రోడ్డున పడ్డారన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more