టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి పార్ధా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని అదుపులోకి తీసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. అమెకు రెండో పర్యాయం ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు తరలిస్తుండగా, అమె కారు దిగకుండా మారం చేసింది. అంతేకాదు తనను వదిలిపెట్టాలని తనకు ఏ పాపం తెలియదని, తనను అనవసరంగా కేసులో ఇరికిస్తున్నారని.. అక్రమంగా తనపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించిన అమె.. తనను బలవంతంగా ఆసుపత్రికి తరలిస్తుండగా, వీల్ చైర్ పై బోరున విలపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే అటు సామాజిక మాద్యమాలతో పాటు ఇటు మీడియాలోనూ విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇలా ఈడీ కేసులంటేనే తీవ్రంగా భయపడిన ఆమె.. తాజాగా తమ ధోరణి మార్చేశారు. తన నివాసాల్లో ఈడీ స్వాదీనం చేసుకున్న రూ 50 కోట్ల నగదుపై అర్పిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను లేని సమయంలో తన ఫ్లాట్లో డబ్బును ఉంచారని ఆమె చెప్పుకొచ్చారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టయిన బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీ ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఆగస్ట్ 3 వరకూ ఈడీ కస్టడీకి న్యాయస్ధానం తరలించింది. జులై 22న అర్పితా నివాసంపై ఈడీ దాడుల్లో రూ 21.90 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ 56 లక్షల విదేశీ నగదు, రూ 76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఆపై అర్పిత మరో ఫ్లాట్లో జరిపిన దాడుల్లో రూ 28.90 కోట్ల నగదు పట్టుబడింది. ఐదు కిలోల బంగారం, పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో పట్టుబడిన నగదు, బంగారం టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ద్వారా రాబట్టిన ముడుపుల సొమ్ముగా భావిస్తున్నారు. ఇక ఈ సొమ్ము తనది కాదని, తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని పార్ధ ఛటర్జీ ఆరోపిస్తున్నారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ వెలుగుచూసిన నేపధ్యంలో పార్ధ ఛటర్జీని పార్టీ పదవుల నుంచి టీఎంసీ తప్పించగా, మమతా కేబినెట్ నుంచి కూడా ఆయనను తొలగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more