టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి పార్ధా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని అదుపులోకి తీసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. అమెకు రెండో పర్యాయం ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు తరలిస్తుండగా, అమె కారు దిగకుండా మారం చేసింది. అంతేకాదు తనను వదిలిపెట్టాలని తనకు ఏ పాపం తెలియదని, తనను అనవసరంగా కేసులో ఇరికిస్తున్నారని.. అక్రమంగా తనపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించిన అమె.. తనను బలవంతంగా ఆసుపత్రికి తరలిస్తుండగా, వీల్ చైర్ పై బోరున విలపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే అటు సామాజిక మాద్యమాలతో పాటు ఇటు మీడియాలోనూ విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇలా ఈడీ కేసులంటేనే తీవ్రంగా భయపడిన ఆమె.. తాజాగా తమ ధోరణి మార్చేశారు. తన నివాసాల్లో ఈడీ స్వాదీనం చేసుకున్న రూ 50 కోట్ల నగదుపై అర్పిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను లేని సమయంలో తన ఫ్లాట్లో డబ్బును ఉంచారని ఆమె చెప్పుకొచ్చారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టయిన బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీ ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఆగస్ట్ 3 వరకూ ఈడీ కస్టడీకి న్యాయస్ధానం తరలించింది. జులై 22న అర్పితా నివాసంపై ఈడీ దాడుల్లో రూ 21.90 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ 56 లక్షల విదేశీ నగదు, రూ 76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఆపై అర్పిత మరో ఫ్లాట్లో జరిపిన దాడుల్లో రూ 28.90 కోట్ల నగదు పట్టుబడింది. ఐదు కిలోల బంగారం, పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో పట్టుబడిన నగదు, బంగారం టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ద్వారా రాబట్టిన ముడుపుల సొమ్ముగా భావిస్తున్నారు. ఇక ఈ సొమ్ము తనది కాదని, తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని పార్ధ ఛటర్జీ ఆరోపిస్తున్నారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ వెలుగుచూసిన నేపధ్యంలో పార్ధ ఛటర్జీని పార్టీ పదవుల నుంచి టీఎంసీ తప్పించగా, మమతా కేబినెట్ నుంచి కూడా ఆయనను తొలగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more