ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మునుగోడులో ఎవరు గెలవాలన్నది నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కోసమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను. అవమానాలు భరించలేకనే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. నా వ్యాపారానికి, రాజకీయ జీవితానికి ఎలాంటి సంబంధం లేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
కొన్ని నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్పై తీవ్ర విమర్శలు చేసి.. తనలో ఇన్నాళ్లు దాగి ఉన్న ఆవేశాన్ని వెళ్లగక్కారు. తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందన్నారు. సోనియాను 20 ఏండ్ల పాటు తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి పీసీసీ అధ్యక్షుడిని చేశారు. సోనియా అంటే ఎంతో గౌరవమున్న తాము.. రేవంత్ కింద పని చేయాలా? అని ప్రశ్నించారు. 20 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధిగా పని చేసిన తాము.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తి కింద పని చేయలేమని తేల్చిచెప్పారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తిని సీఎం చేయాలా? అని కాంగ్రెస్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తన మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది. తాను ఏం తప్పు చేశాను అని అడిగారు. ఏ చర్చకైనా సిద్ధమని తేల్చిచెప్పారు. అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా బలహీన పడిందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కమిటీలు వేసినప్పుడు కూడా కనీసం తనను సంప్రదించలేదు. కాంగ్రెస్ పార్టీలో తనను ఘోరంగా అవమానించారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను. అవమానాలు భరించలేకనే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more