హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం సృష్టించాయి. ఇవాళ ఉదయం నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఫెమా ఉల్లంఘనలకు పాల్పడిన క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. వీరిద్దరిపై విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో బోయిన్పల్లిలోని మాధవరెడ్డి, ఐఎస్ సదన్లోని చీకొటి ప్రవీణ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. విదేశాల్లో నిర్వహించిన క్యాసినోలలో వీరు అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది.
వీరు నేపాల్ లో రెండు పర్యాయాలు క్యాసినో నిర్వహిస్తున్నట్లు ఈడీకి సమాచారం అందింది. దీంతో వీరిపై దృష్టి సారించిన ఈడీకి అంతకుముందు వీరు ఇండోనేషియా, బంగ్లాదేశ్ లలోనూ క్యాసినోలు నిర్వహించారని, అక్కడ విజేతలకు హవాలా రూపంలో ప్రైజ్ మనీ చెల్లించారని కూడా ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ నుంచి నుంచి పేకాట రాయుళ్లను ప్రత్యేక విమానాలలో తీసుకెళ్లి క్యాసినో ఆడిస్తున్నట్లు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా వెస్ట్ బెంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్పోర్టుకు కస్టమర్లను తరలించి.. అటునుంచి నేపాల్లోని హోటల్ మెచి క్రౌన్లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది.
ఈ ఈవెంట్లో టాలీవుడ్, బాలీవుడ్, నేపాలీ డ్యాన్సర్లతో కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయించారు. శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, నేపాల్లో క్యాసినో నిర్వహించి, ప్రైజ్మనీని హవాలా రూపంలో చెల్లించారు. వారంపాటు అక్కడే ఉండి క్యాసినో ఆడేందుకు ఒక్కో కస్టమర్ నుంచి రూ.3 లక్షల రూపాయలు వసూలు చేశారని,నాలుగు రోజుల ప్యాకేజీలో భాగంగా ప్లాన్ టారిఫ్లు సైతం అందించారు. నేపాల్తో పాటు ఇండోనేషియాలోనూ క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్లు తేలింది. దీంతో.. ఫెమా నిబంధనల కింద కేసు నమోదు చేసింది ఈడీ. కాగా, గుడివాడతోపాటు హైదరాబాద్ క్యాసినో ఆడిస్తూ చికోటి ప్రవీణ్ గతంలో పట్టుబడ్డాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more