కేంద్ర ప్రభుత్వానికి దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద అరెస్టు చేసే, సమన్లు జారీ చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్కు ఉన్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పలు నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. ఈ చట్టం ప్రకారం పనిచేసే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తులో భాగంగా చేస్తున్న సోదాలు, అరెస్టులు, ఆస్తుల సీజ్ వంటి అన్ని చర్యలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.
నిధుల మళ్లింపు నిరోధక చట్టం కింద విచారణ చేపట్టేందుకు, అరెస్టు చేసేందుకు, ప్రాపర్టీని అటాచ్ చేసేందుకు ఈడీకి అన్ని అధికారాలు ఉన్నట్లు అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో తెలిపింది. పీఎంఎల్ఏ కింద ఉన్న అన్ని ఈడీ అధికారాలను సుప్రీం సమర్థించింది. కారణాలు చెప్పకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదన్న వాదనను కూడా న్యాయస్థానం కొట్టిపారేసింది. విచారణ సమయంలో బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేస్తోందని కార్తీ చిదంబరం, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వంటి పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా ఆ వాదనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.
జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలో జస్టిస్ దినేష్ మహేశ్వరీ, జస్టిస్ సి.టి. రవికుమార్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలవరించింది. ఈడీ, ఎస్ఎఫ్ఐవో, డైరక్టరేట్ ఆఫ్ రెవన్యూ ఇంటెలిజెన్స్ లాంటి దర్యాప్తు ఏజెన్సీలు పోలీసులు కాదు అని, అందుకే విచారణ సమయంలో వాళ్లు సేకరించిన ఆధారాలు వాస్తవమైనవే అని సుప్రీంకోర్టు పేర్కొంది. మనీల్యాండరింగ్ కేసులో అరెస్టు చేస్తున్న వ్యక్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నారో ఈడీ అధికారులు చెప్పాల్సిన అవసరం లేదని.. ఈడీ అధికారులు పోలీసులు కాకపోవడం కారణంగా వారు ఎఫ్ఐఆర్ కు బదులుగా ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును దాఖలు చేస్తారని.. అయితే ఈ రెండు వేర్వేరని న్యాయస్థానం పేర్కొన్నది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more