Meet modern-day ‘Shravan Kumar’ ‘‘ఇదిగో ఇతడే కలియుగ శ్రవణ కుమారుడు’’

Ghaziabad man carries elderly parents on shoulders for pilgrimage

Vikas Gehlot carries his parents on kanwar, Ghaziabad youth carries parents on kanwar, modern Shravan Kumar, vikash gehlot Kanwar Yatra with parents, Haridwar to Ghaziabad, Vikas Gehlot turns modern shravan kumar, Ghaziabad man carries parents on kanwar, Ghaziabad, Shravan Kumar, Kanwar Yatra, Haridwar, Vikas Gehlot, Kanwar Yatra 2022, Uttarakhand

The Kanwar Yatra 2022 is happening with full enthusiasm after a gap of two years owning to the Covid-19 pandemic. Lakhs of Kanwariyas all over India have been undertaking the arduous journey to collect water from holy rivers and offer it to Lord Mahadev. Vikas Gehlot is shown arriving in Haridwar on foot from Ghaziabad, leading her parents in a kanwar. To hide his pain from his parents, he blindfolded both of them.

ITEMVIDEOS: కలియుగ శ్రవణుడు.. కావడి యాత్రలో గంగాజలంతో పాటు తల్లిదండ్రులు..!

Posted: 07/26/2022 03:46 PM IST
Ghaziabad man carries elderly parents on shoulders for pilgrimage

రోజుకు 24 గంటల సమయం ఇచ్చినా సరిపోని పనిబారంతో నిత్యం బిజిబిజీగా గడుపుతున్న నేటి తరం యువత, మధ్యవయస్కులు తమ తల్లిదండ్రులను చూసుకునే వీలు లేక వారిని వృద్దాశ్రమాలలో చేర్పించి చేతులు దులుపుకుంటున్నారు. నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ విష సంస్కృతి తాజాగా పట్టణాలకు కూడా పాకింది. దీంతో వయస్సు పైబడిన తల్లిదండ్రులు వారికి భారం అవతున్నారు. తమ ఆనందాలకు వారు అడ్డంకిగా మారుతున్నారు అనుకునే వారు.. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ కు చెందిన ఈ కలియుగ శ్రావణుడి గురించి తెలుసుకోవాల్సిందే.

కలియుగ శ్రవణుడు ఏంటీ..? అసలు శ్రవణుడు అంటే ఎవరు అన్న ప్రశ్నలు మనలో చాలామందిలో తలెత్తుతాయి. రామాయణం విన్న వారికి, చదివిన వారికి శ్రవణ కుమారుడు గురించి, అతడి గొప్పతనం గురించి తెలిసే ఉంటుంది. అంధులైన తల్లిదండ్రులను పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లేందుకు వారిని కావడిలో కూర్చోబె్ట్టి.. తన భుజాలపై మోసుకెళ్తాడు. అయితే అయోధ్య రాజ్య సమీపంలో సరయు నది చెంతకు రాగానే తన తల్లిదండ్రులు దాహంగా ఉందిన చెప్పడంతో.. సరయు నది వద్దకు వెళ్లి నీటిని తీసుకువచ్చేందుకు వెళ్తాడు. నదిని సమీపించి నీటిని తీసుకువస్తుండగా, దశరథ మహారాజు ఆయనను జంతువుగా భావించి.. బాణం వదలగా అతను మరణిస్తాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన వికాస్ గహ్లోత్‌ను చూసిన వారు ఇప్పుడు ‘కలియుగ శ్రవణుడు’ అని కీర్తిస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులు కావడి యాత్ర చేయాలని బావించగా వారి ఆశను ఆయన వారితో పూర్తి చేయించాడు. ఇలా వారి కావడి యాత్ర ఆకాంక్షను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఎండ, వానను లెక్కచేయకుండా తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. కావడి యాత్ర చేయాలని ఉందని తల్లిదండ్రులు చెప్పగానే మరోమాటకు తావులేకుండా సరేనన్న వికాస్.. వారితో కలిసి హరిద్వార్ చేరుకున్నాడు.

గంగానదిలో స్నానమాచరించి పవిత్ర జలాన్ని సేకరించాడు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన కావడిలో తల్లిదండ్రులను కూర్చోబెట్టి 200 కిలోమీటర్ల దూరంలోని ఘజియాబాద్‌కు బయలుదేరాడు. గంగాజలం నింపిన 20 లీటర్ల డబ్బాను తండ్రి వద్ద ఉంచాడు. ఆపై తన కష్టాన్ని తల్లిదండ్రులు చూడకుండా ఉండేందుకు వారి కళ్లకు గంతలు కట్టాడు. ఈ నెల 17న వికాస్ యాత్ర ప్రారంభమైంది. అతడికి అండగా ఇద్దరు స్నేహితులు కూడా వెంట నడిచారు. ఈ యాత్ర మీరట్ చేరుకుంది. అక్కడ స్థానిక జిల్లా పంచాయతీ అధ్యక్షుడు గౌరవ్ చౌదరి వారిని సన్మానించారు. తల్లిదండ్రుల కావడి యాత్ర కోరికను తీరుస్తున్న వికాస్‌ను అభినందించారు. అభినవ శ్రవణుడంటూ కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghaziabad  Shravan Kumar  Kanwar Yatra  Haridwar  Vikas Gehlot  Kanwar Yatra 2022 Uttarakhand  

Other Articles