నేరం చేశారన్న అభియోగాలు నిరూపితం కాకుండా ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీల బెయిల్ పిటిషన్ల విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులలో తమకు బెయిల్ మంజూరు చేయాలని అనేకమంది పెట్టుకున్న బెయిల్ పిటీషన్ల విచారణలో జరుగుతున్న సుదీర్ఘజాప్యంపై అలహాబాద్ హైకోర్టును అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోర్టు మందలించింది. బెయిల్ కోసం దాఖలైన పిటీషన్ల విచారణను వేగంగా పరిష్కరించేందుకు భిన్నంగా ఆలోచించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
కేసుల సత్వర పరిష్కారానికి సెలవు దినాల్లోనూ పని చేయాలని సూచించింది. హైకోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టుకు ఆయా విషయాలను నిర్వహించడం కష్టంగా అనిపిస్తే.. వాటిని తమకు సిఫారసు చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదనపు భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నామని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 853 క్రిమిన్ అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయన్న ధర్మాసనం ఆయా పిటిషనర్లు పదేళ్లకుపైగా జైలు జీవితం గడిపారని, వ్యక్తి స్వేచ్ఛతో రాజీపడుతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై ఆగస్ట్ 17న విచారించనున్నది.
ఇదే సమయంలో 853 కేసుల జాబితాను సమర్పించాలని ధర్మాసనం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో దోషిగా తేలిన ఖైదీ నిర్బంధకాలానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని, ఈ కేసుల్లో ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఎంత మందికి బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించింది? అనే వివరాలు సమర్పించాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి రెండువారాల సమయం ఇచ్చింది. 15 సంవత్సరాలు పైబడిన, 10 నుంచి 14 సంవత్సరాల మధ్య ఖైదీలకు సంబంధించి హైకోర్టు సీనియర్ రిజిస్ట్రార్ దాఖలు చేసిన నివేదికను సుప్రీం కోర్టు పరిశీలించింది.
62 బెయిల్ పిటిషన్లను ఇంకా పరిష్కరించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి జూలై 17 వరకు 232 కొత్త బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. మరో వైపు పిల్లలు కనేందుకు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్ను వచ్చేవారం లిస్ట్ చేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశించింది. రాజస్థాన్ హైకోర్టు నిర్ణయం తర్వాత బెయిల్ కోరుతున్న వారి సంఖ్య పెరిగిందని ఓ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more