నానాటికీ దేశంలో ప్రజల సంఖ్య పెరుగుతోంది. అరణ్యాలను సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకునే స్థాయికి వెళ్లడంతో.. అడవుల్లో ఉన్న వన్యమృగాలు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అటవీప్రాంతాలకు శివార్లలో ఉన్న గ్రామాలపై విరుచుకుపడి అక్కడి పంటలను నాశనం చేస్తున్నాయి. ఇక తమ ప్రాణాలకు కూడా ఎక్కడ హాని కలుగుతుందోనని గ్రామ ప్రజలు కూడా కంటిమీద కునుకు కరువవుతోంది. అయితే ఏనుగులు, అడవి పందుల నుంచి అధిక నష్టాన్ని ఎదుర్కోంటున్న రైతులు.. అవి తమ పంటలపై దాడి చేయకుండా రక్షణ చర్యలకు పూనుకుంటున్నారు.
దీంతో అటు అడవుల్లో ఉంటూ సాత్వికమైన ఆహారాన్ని తీసుకునే వన్యమృగాలు ఆహారాన్ని వెతుక్కుంటూ.. జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇక తాజాగా ఓ గజరాజు మాత్రం తనకు తాను ఎప్పుడు చూసిందో తెలియదు కానీ ఓ రహదారిని టార్గెట్ గా చేసుకుని ఆ మార్గంలోనే తిష్టవేసింది. అక్కడి నుంచి వెళ్తున్న భారీ వాహనాలైన మాల్ గాఢీలపై నజర్ వేసింది. అప్పట్లో ఓ నాలుగు ఏనుగులు కలసి లారీల్లోంచి చెరుకు గడలను తీసుకుని తినేశాయి. ఇలా కొంత చెరుకును అవి తిన్న తరువాత లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడి నుంచి తన గమ్యస్థానానికి తరలించాడు.
ఆ విషయం గుర్తుందో లేక అలాగే మరో లారీ వస్తుందనుకునే ఓ గజరాజు మాత్రం చెరుకు లోడ్డును తీసుకువెళ్లే లారీల కోసం అదే రహదారిపై కాపుకాసింది. ఆ లారీ రాగానే దానికి అడ్డుగా వెళ్లి లారీ పై నుంచి చెరుకు గడలను తన తొండంతో తీసుకుని తినింది. ఇక చాలు జరగవే అన్నట్లుగా లారీ డ్రైవర్ హారన్ కోట్టినా అది ఏ మాత్రం కదలకుండా చెరుకు గడలను తింటూ కొద్ది సేపు ఆస్వాదించింది. ఈ ఘటన తమిళనాడు ఈరోడ్లో జరిగింది. చెరకు లోడ్తో వెళ్తున్న ఓ ట్రక్కును ఆపిన ఏనుగు. ఏంచక్కా.. చెరకు గడలను తీసుకుంటూ తినసాగింది.
డ్రైవర్ భయంతో.. బయటకు రాకుండా వాహనాన్ని అలాగే ఉండనిచ్చాడు. కొద్ది సమయం తరువాత ఏనుగును తప్పుకునేలా గట్టిగా హారన్ మ్రోగించాడు. అయినా ఏనుగు మాత్రం తనకు కావాల్సినన్ని చెరుకు గడలు తినేవరకు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో అసనూర్ సమీపంలోని సత్యమంగళం- మైసూర్ హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఏనుగు కదిలేంత వరకు వాహనాలు ఏమీ వెళ్లనీయకుండా రహదారికి ఇరువైపులా కాపలాగా ఉన్నారు. ఏనుగు కాసేపటికి కదలి అడవిలోకి తిరిగివెళ్లింది. జులై 21న జరిగిన ఈ ఘటన సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more