మధ్యప్రదేశ్లో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అధికార బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్ను లోట్టబోయిందన్న చందంగా మారింది. రాష్ట్రంలో సంపూర్ణ స్థాయిలో మెజారిటీని గతంలో నిలుపుకున్న కాషాయపార్టీ.. ఈ సారి ఎన్నికలలో నాలుగు స్థానాలను ప్రతిపక్ష పార్టీలకు చేజార్చింది. అయితే ప్రస్తుతానికి బీజేపియే అధిక స్థానాలను కైవసం చేసుకున్నా.. పార్టీలో మాత్రం అంతర్మధనం కొనసాగుతోంది. ఈ ఫలితాలు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఊరటనివ్వగా.. పంజాబ్ లో విజయదుఃధుభి మ్రోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మధ్యప్రదేశ్ ఎన్నికలలో బోణి కొట్టింది.
రాష్ట్రంలోని మొత్తం 16 నగర పాలక సంస్థలకు తొలి విడతలో జరిగిన ఎన్నికల్లో 11 కార్పొరేషన్లకు గాను ఏడింటిని మాత్రమే బీజేపీ నిలబెట్టుకోగలిగింది. కాగా బీజేపి అధిపత్యానికి చెక్ పెట్టిన కాంగ్రెస్ మూడింటిని హస్తగతం చేసుకోగా, అమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక కార్పోరేషన్ ను దక్కించుకుంది. ఇక ఇప్పటివరకు కేవలం తెలంగాణ, మహారాష్ట్ర సహా కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఎంఐఎం పార్టీ.. మధ్యప్రదేశ్లో బోణి కోట్టింది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటరైన అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం కూడా కార్పోరేషన్ ఎన్నికలలో నాలుగు కార్పరేటర్ సీట్లలను దక్కించుకుంది. జబల్పూర్, బుర్హాన్పూర్, ఖండ్వాలలో మొత్తం నాలుగు కార్పొరేటర్ స్థానాలను చేజిక్కించుకుంది.
గతంలో ఈ 16 కార్పొరేషన్లను బీజేపీ సొంతం చేసుకోగా ఇప్పుడు వాటిలో సగం స్థానాలను కోల్పోయింది. ఇక రాష్ట్రంలో జరిగిన 36 నగర పాలికల ఎన్నికలలో బీజేపి తన అధిపత్యాన్ని చాటుకుంది. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ నాలుగు స్థానాలను స్వతంత్రులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక బాలఘాట్ జిల్లా పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్.. అధికార బీజేపిపై తన సత్తాను చాటింది. మొత్తం 27 స్థానాల్లో కాంగ్రెస్ 14, బీజేపి 06, స్వతంత్రులు 06, జిజిపి 01 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. తాజా ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని చెప్పేందుకు ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more