ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయిన ఓ బాలుడ్ని స్థానికులు రక్షించారు. స్థానిక యువకుడొకరు ప్రాణాలకు తెగించి చాకచక్యంగా వ్యవహరించి బాలుడ్ని కాపాడాడు. బాలుడ్ని సురక్షితంగా బోరు బావి నుంచి కాపాడటంతో చొరవ చూపిన సురేష్ అనే యువకుడిని స్థానికులు, పోలీసులు అభినందించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండు గోలనుగుంటలో ఈ సంఘటన బుధవారం చోటుచేసుకున్నది. గుండు గోలనుగుంటకు చెందిన పూర్ణ జశ్వంత్ బుధవారం సాయంత్రం ఇంటికి సమీపంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు.
తమ ఇంటికి సమీపంలో ఉన్న 400 అడుగుల లోతులో తీసిన బోరుబావిలో బాలుడు పడిపోయాడు. అయితే మట్టి కూరుకుపోవడంతో 30 అడుగులలోతులో ఉన్న బండరాయిపై ఇరుక్కుపోయాడు. తల్లిదండ్రులు కొడుకు జస్వంత్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. చివరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో బోరు బావిలో నుంచి జస్వంత్ కేకలు వేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. స్థానికులు వెంటనే తాళ్ల సహాయంతో బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నించారు. దాదాపు 5 గంటలకు పైగా జస్వంత్ బోరు బావిలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు.
నడుం భాగానికి తాడు కట్టుకుని బోరుబావిలోకి సురేష్ అనే యువకుడు దిగాడు. జస్వంత్ను పట్టుకోగానే స్థానికులు పైగి లాగారు. బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోరు బావి ప్రమాదం నుంచి ప్రాణాలతో బాలుడు బయటపడటంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. బాలుడ్ని కాపాడటంలో ధైర్యం చేసి బోరుబావిలోకి దిగిన యువకుడు సురేష్ను గుండు గోలనుగుంట వాసులు అభినందించారు. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more