గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే బీజేపీ ముఖ్యమంత్రి పగ్గాలను చేపడుతుందని.. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ సీఎంగా బాధ్యతలను స్వీకరిస్తారని వేసిన అంచనాలను తలకిందులు చేస్తూ.. ట్విస్ట్ ఇచ్చింది బీజేపి. సీఎంగా శివసేన రెబల్ ఎమ్మెల్యేల గ్రూపు నాయకుడు ఏక్ నాథ్ షిండేను ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ విపక్ష నేత దేవేంద్ర ఫడ్నావిస్ సంచలన ప్రకటన చేశారు.
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో శిబిరం నిర్వహించిన షిండే గురువారం మధ్యాహ్నం గోవా నుంచి ముంబై చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఫడ్నవీస్ ఇంటికి వెళ్లిన షిండే.. ఆయనతో కలిసి గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలిశారు. ప్రస్తుత సమీకరణాల పరంగా ప్రభుత్వ ఏర్పాటు తమకే సాధ్యమని, సంఖ్యాపరంగా ఎక్కువమంది ఎమ్మెల్యేల బలం తమకే ఉందని ఈ సందర్భంగా ఫడ్నవీస్ ఉద్ఘాటించారు. రేపటి ప్రమాణస్వీకారం సందర్భంగా కొద్దిమంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దేవేంద్ర ఫడ్నావిస్ సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫడ్నవీస్ సంచలన ప్రకటనలు చేశారు. షిండే నేతృత్వంలో శివసేన ప్రభుత్వం కొలువుదీరనుందని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా తాము షిండే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని, ప్రభుత్వంలో చేరబోమని ప్రకటించారు. అంతేకాకుండా షిండే ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యత తమదేనని కూడా ఫడ్నవీస్ మరో కీలక ప్రకటన చేశారు. వెరసి మహారాష్ట్ర తదుపరి సీఎం ఫడ్నవీస్ అన్న అందరి అంచనాలను ఆయన తలకిందులు చేసేశారు. ఫడ్నవీస్ ప్రకటనకు ముందే... షిండేను శివసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లుగా ఓ ప్రకటన వెలువడింది.
మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్నాథ్ షిండే అని ప్రకటించారు. ఆయన ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఏక్నాథ్ షిండే ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. అలాగే మంత్రివర్గ విస్తరణలో శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలతోపాటు, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉంటారని వెల్లడించారు. మరోవైపు వారం పాటు గౌహతిలో ఉండి బుధవారం అక్కడి నుంచి గోవాలోని హోటల్కు మకాం మార్చిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఏక్నాథ్ షిండేను సీఎంగా ప్రకటించడంతో సంతోషంతో డ్యాన్సులు వేశారు. షిండే సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు కానుడటంతో ఆనందం పట్టలేకపోతున్నారు.
#WATCH | Eknath Shinde-faction MLAs, staying at a hotel in Goa, celebrate following his name being announced as the Chief Minister of Maharashtra. pic.twitter.com/uJVNa4N74g
— ANI (@ANI) June 30, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more