పానీ పూరి పేరు చెబితే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరుతుంది. గోళానికి ఓ వైపు విరగగొ్ట్టి.. అందులో వేడివేడి చాట్ వేసి.. దానిని చేదు మినహాయించి షడ్రుచుల కలిసిన నీటిని నింపి.. చకచకా అందిస్తుండే.. వాటిని అమాంతం నోటిలో పెట్టుకుని కేవలం దవడలను దగ్గరకు తీసుకురావడంత అది కాస్దా విరిగి అందులోని నీరు, చాట్ అంటా నోటి నిండుగ కాగా, నీటిని మింగేసి.. మిగతాదంగా నమిలేసి మళ్లీ మరో గోల్ గప్పా కోసం రెడీ అవుతాం. ఇక మరికోందరు వీటిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని తింటారు. ఇక కాస్తా కాస్ట్లీ సెంటర్లలో వీటిలో పెరుగును, లేదా స్వీటును కూడా పూరించి ఇస్తారు.
ఇలా దీనిని ఎలా అరగిస్తారని చెబుతుంటేనే నోరూరుతుంది కదూ.. కానీ అలాంటి పానీ పూరిపై రాజధాని నగరంలో నిషేధం విధించారంటే నమ్మశక్యమేనా.? అన్న అనుమానాలు వస్తున్నాయానా.? పానీపూరి.. ఛాట్ పై అధారపడి కొన్ని వేల కుటుంబాటు జీవనం సాగిస్తున్నాయి. ఇక వీటిపై నిషేధం విధిస్తే మరి వారికి మరో జీవనాధారం చూపించాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే ఉంది. అయితే ఈ నిషేధం విధింపు మన హైదరాబాద్ నగరంలోనో.. లేక అమరావతి నగరంలోనో కాదు.. అసలు మన రాష్ట్రాలోనే కాదు, మన దేశమే కాదు.. మరెక్కడా అంటారా.. మన పోరుగు దేశంలో. అదేనండీ నెపాల్ లో. నేపాల్ లోని ఖాట్మండులో పానీ పూరిపై నిషేధం విధించారు.
అయితే అందుకు తగు కారణాలను అక్కడి అధికారులు పేర్కోన్నారు. కలరా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయన్న కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండులో పానీ పూరీపై నిషేధం విధించారు. ఇక్కడి లలిత్ పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పానీపూరీకి ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట. దీంతో ఇక్కడ పానీపూరీ అమ్మకాలు నిషేధిస్తున్నట్లు లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ (ఎల్ఎంసీ) అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ప్రజలంతా డయేరియా, కలరా వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more