తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అయితే ఇంటర్ ఫలితాల్లో యధావిధిగా బాలికలదే సత్తాచాటారు. ఇంటర్ సెకండియర్లో మొత్తం 4,63,370 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 2,95,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇక వీరిలో 1,59,422 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించగా, 82,481 మంది విద్యార్థులు బి గ్రేడ్ సాధించారని తెలిపారు. మొత్తంగా 67.82 శాతం మంది విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.
2,16,389 మంది 1,64,172 మంది ఉత్తీర్ణత సాధించగా, 75.86 శాతం మంది బాలికలు పరీక్షలలో ఉత్తర్ణులయ్యారని తెలిపారు. ఇక అదే విధంగా ఇంటర్ సెకండియర్లో 2,19,981 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 1,32,771 మంది విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలలో 60 శాతం మంది బాలురు ఉత్తర్ణీత సాదించారని మంత్రి తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో జిల్లాల వారీగా పరిశీలిస్తే 78శాతంతో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అగ్రస్థానంలో నిలువగా, సెకండ్ ఫ్లేస్ లో 77శాతం ఉత్తీర్ణతతో కుమరంభీమ్ అసిఫాబాద్ జిల్లా నిలిచిందని మంత్రి తెలిపారు.
ఇంటర్ ఫస్టియర్ లో 4,64,892 మంది విద్యార్థులు పరీక్షలకు రాయగా, 2,94,378 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా, 1.93,925 మంది ఏ గ్రేడ్ సాధించగా, బి గ్రేడ్ సాధించిన విద్యార్ధులు 63,501 మంది విద్యార్థులు ఉన్నారని మంత్రి తెలిపారు. 63.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇక తొలి సంవత్సర పరీక్షలకు 2,33,210 పరీక్షలకు హాజరుకాగా, 1,68,692 మంది 72.33శాతం ఉత్తర్ణత సాధించారని తెలిపారు. ఇక ఫస్టియర్ లో 2,31,682 మంది బాలురు పరీక్షలకు హాజరయ్యారని వారిలో 1,25,686 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొత్తంగా బాలురలో ఫస్టియర్ పరీక్షలలో 54.55 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇక జిల్లాల వారీగా ఉత్తీర్ణత పరిశీలిస్తే.. తొలి స్థానంలో 76శాతంతో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నిలిచిందని తెలిపారు. రెండవస్థానంలో హన్మకొంగ 74శాతంతో ముందుందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గడిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్లైన్లో బోధన చేశాం. గతేడాది 70 శాతం సిలబస్తోనే పరీక్షలు నిర్వహించామని చెప్పారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సెలింగ్లు కూడా నిర్వహించామని పేర్కొన్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు స్వీకరిస్తాం. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కూడా అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more