అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తోన్న సుబ్బారావు సహా అతని ముగ్గురు అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయగా, ఇవాళ ఆయన నాంపల్లి కోర్టులో తన బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. రైల్వే స్టేషన్లో విధ్వంసం కేసుతో తనకు సంబంధం లేదని ఆవుల సుబ్బారావు బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు.
ఆర్మీలో సేవ చేసి.. అదే స్పూర్తితో యువత సైన్యంలో చేరాలని ప్రోత్సహించినట్టుగా పేర్కొన్నారు. దేశాన్ని, దేశ ప్రజలను రక్షించడం అనేది ఎంతో పెద్ద అదృష్టమని.. దీనిని యువత అందిపుచ్చుకోవాలని వారిని ప్రోత్సహించానని, ఆర్మీలోకి చేరేందుకు వందల మందిని ప్రోత్సహించానని చెప్పారు. పోలీసులు తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో సుబ్బారావును ప్రధాన సూత్రధారిగా తేల్చిన రైల్వే పోలీసులు.. ఇక ఆధారాలను కూడా సేకరించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని భావించిన అభ్యర్థులను ఒక్కరోజు ముందుగానే వారిని తీవ్రంగా రెచ్చగోట్టాడని పోలీసులు తెలిపారు.
సూత్రధారితో పాటు కేసులోని నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాట్సప్ గ్రూప్లు ఏర్పాటు చేసి విధ్వంసం సృషించే విధంగా వాళ్లు ప్లాన్ చేసినట్లు పోలీసులు గర్తించారు. 16న సాయంత్రం నరసరావుపేట నుంచి హైదరాబాద్ వచ్చిన సుబ్బారావు,.. బోడుప్పల్లోని ఎస్వీఎం గ్రాండ్ లాడ్జిలో బస చేసినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లో చేసే విధ్వంసానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూపులో పోస్టు చేశారని పేర్కొన్నారు. అభ్యర్థులను రెచ్చగొట్టి సికింద్రాబాద్ వచ్చేలా చేయాలని తన అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డికి ఆవుల సుబ్బారావు సూచించారని పోలీసులు గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more