విధి అడే వింత నాటకంలో అందరం పావులమే. అయితే.. ఎవరి ఆట ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తాం. అయితే నిజమని రుజువు చేసే ఘటనలు జరిగితే.. నిరూపించడం కోసం కాకపోయినా.. కదులుతున్న కారులో వెళ్తున్న ఓ బ్యాంకు మేనేజరు మరణించడం, అమె సోదరి జీనర్మరణాల మధ్య పోరాడుతున్న విషాధ ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. రోడ్డుపై వెళ్తున్న ఆ కారుపై చెట్టు కూలి అర్థాంతరంగా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఎవరైనా అనుకుంటారా.
కానీ అదే జరిగింది. కారులో వెళ్తున్న వారికి క్షణం క్రితం వరకు అంతా సజావుగానే ఉందని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇంతలో రోడ్డు పక్కనున్న వృక్షమే వారి పాలిట మరణశాసనాన్ని రాసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన వాణి కబిలన్ అనే మహిళ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. జూన్ 24 సాయంత్రం ఆఫీస్ ముగించుకుని తన సోదరి ఎళిలరసితో కలిసి చెన్నైలోని కేకే నగర్ వైపు కారులో వెళుతున్నారు.
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కారులో వెనుక సీట్లలో కూర్చున్నారు. కార్తీక్ అనే వ్యక్తి కారు నడుపుతున్నాడు. లక్ష్మీ స్వామి రోడ్ నుంచి పీటీ రాజన్ రోడ్ వైపు కారు వెళుతుండగా ఉన్నట్టుండి ఒక పెద్ద చెట్టు కూలి కారుపై పడింది. కారు వెనుక వైపు ఆ చెట్టు అమాంతం పడటంతో ముందు డ్రైవర్ సీట్లో ఉన్న కార్తీక్.. అదిరిపడ్డాడు. డోర్ తీసుకుని బయటపడ్డ డ్రైవర్ భయంతో ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. వాణి, ఎళిలరసిలను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ.. చెట్టు అమాంతం వారు కూర్చున్న భాగంలోనే పడటంతో వాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆమె సోదరిని కారులో నుంచి బయటకు తీసుకొచ్చినప్పటికీ తీవ్రంగా గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు సిబ్బంది కూడా స్పాట్కు చేరుకుని కారుపై పడిన ఆ చెట్టును ప్రొక్లెయిన్ సాయంతో పక్కకు నెట్టేశారు. ఎళిలరసిని కేకేనగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్కు తరలించారు. పోస్ట్మార్టం నిమిత్తం వాణి మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే.. సింగారా చెన్నై 2.0 ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న డ్రెయిన్కు దగ్గరగా ఉన్నట్టు తెలిసింది.
దీంతో.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే.. జూన్ 22 నుంచి అక్కడ ఎలాంటి తవ్వకపు పనులు జరగలేదని.. ఆ చెట్టు కూలిన ప్రాంతానికి, పనులు జరుగుతున్న ప్రాంతానికి 10 అడుగుల దూరం ఉందని చెన్నై కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి తవ్వకాలు జరగకపోతే అంత పెద్ద చెట్టు మరి ఉన్నట్టుండి ఎందుకు కూలిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ఊహించని ఘటన కారణంగా ఒక నిండు ప్రాణం పోయింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more