దేశ ప్రజలపై ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రప్రభుత్వం భారీగా ఆదాయం పోందుతుంది. జీఎస్టీ ఆదాయం మే నెలలో రికార్డు స్థాయి గరిష్టాం నుంచి కిందకి జారింది. ఇక దీంతో ఇకపై ప్రతీ నెల నమోదయ్యే అదనపు జీఎస్టీ ఏ నెలకా నెల రికార్డు స్థాయి గరిష్టాన్ని అందుకోనుందని భావించగా, ఈ రికార్డు గరిష్టం నుంచి ఈ నెలలోనే కిందకు జారింది. ఇంతకీ మే 2022లో జీఎస్టీ కింద వసూలయిన మొత్తం ఎంతో తెలుసా.? వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)గా ఈ నెలలో వసూలైన మొత్తం రూ. 1.41 లక్షల కోట్లు. 2021 మే నెలతో పోల్చితే ఇది 44 శాతం ఎక్కువని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలతో పోలిస్తే మాత్రం ఈ జీఎస్టీ వసూళ్ల కాస్త తక్కువ నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలలో రూ. 1.41 లక్షల కోట్లుండగా, ఏప్రిల్ నెలలో జీఎస్టీ రూ. 1.68 లక్షల కోట్ల మేర వసూలైంది. అది రికార్డుస్థాయి గరిష్ఠం కావడం విశేషం. దీంతో గత నెలతో పోల్చితే ఏకంగా 27 వేల కోట్ల రూపాయల జీఎస్టీ మే నెలలో తక్కువగా వసూళ్లైంది. ఫిబ్రవరి నెలలో జీఎస్టీ రూ. 1.33 లక్షల కోట్లు నమోదైంది. ‘స్థూల జీఎస్టీ రెవెన్యూ మే 2022లో రూ. 1,40,885 కోట్లుగా ఉంది. ఇందులో సీజీఎస్టీ రూ. 25,036 కోట్ల మేర, ఎస్జీఎస్టీ రూ. 32,001 కోట్ల మేర, ఐజీఎస్టీ రూ. 73,345 కోట్ల మేర ఉంది. ఇక సెస్ రూపంలో రూ. 10,502 కోట్లు వసూలైంది..’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
2021 మే నెలలో రూ. 97,821 కోట్లు వసూలైందని, దీనితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో 44 శాతం అధికంగా పన్నులు వసూలయ్యాయని తెలిపింది. నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ. 1.40 లక్షల కోట్లు దాటడం ఇది నాలుగో సారి. మార్చి నుంచి ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. 2022 మే నెలలో కూడా స్థూల జీఎస్టీ రాబడులు రూ.1.40 లక్షల కోట్ల మార్కును అధిగమించడం ప్రోత్సాహకరంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2022 నెలలో జనరేట్ అయిన మొత్తం ఇ-వే బిల్లుల సంఖ్య 7.4 కోట్లు. ఇది మార్చి 2022 నెలలో జనరేట్ చేసిన 7.7 కోట్ల ఇ-వే బిల్లుల కంటే 4 శాతం తక్కువ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more