Crocodile drags 38-year-old man into river ఒడ్డున స్నానం చేస్తున్న వ్యక్తిన.. నదిలోకి లాక్కుపోయిన మొసలి

Crocodile drags 38 year old man into river search on

man draged into sea, crocodile drags man into sea, crocodile attacks bathing man, parvati river, Ram Ghat, Kota's SDRF team, Khatoli town, Kota, Rajasthan, Crime

In a shocking incident, a crocodile attacked a 38-year-old man in Rajasthan's Khatoli town and dragged him inside a river. The man had been bathing when the crocodile attacked him. The victim has been missing.

పార్వతి నది ఒడ్డున స్నానం చేస్తున్న బిల్లూ.. నదిలోకి లాక్కుపోయిన మకరం

Posted: 05/19/2022 11:45 AM IST
Crocodile drags 38 year old man into river search on

నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు ప్రతీరోజు నదుల్లోనే స్నానం చేస్తుంటారు. నదీ సాన్నాలు ఆచరించడం వారి జీవన విధానంలో భాగమైపోతుంది. క్రమంగా అడవులు తగ్గడం, వర్షాలు కురవకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రవహించాల్సిన నదులు కూడా నానిటికీ కుచించుకుపోతున్నాయి. దీంతో నదీ ప్రవాహాల్లో నీటితో పాటు జీవించే జంతుచరాల సంఖ్య కూడా నానాటికీ తగ్గుముఖం పడుతోంది. దీంతో ఎప్పుడో కానీ కనబడని మకరాలు కూడా ఆ మధ్యకాలంలో మనుషులపై దాడి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ లో ఓ నదీ ఒడ్డున్న స్థానిక గ్రామస్థులతో పాటుగా స్నానం చేస్తున్న ఓ వ్యక్తిపై దాడిచేసిన మొసలి అతడిని నదిలోకి లాక్కెళ్లింది.

రాజస్థాన్‌లోని కోటా సమీపంలో ఈ దిగ్ర్భాంతికర అనూహ్యఘటన చోటుచేసుకుంది. నదిలో స్నానం ఆచరిస్తున్న మరికోందరు గ్రామస్థులు.. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు సంబంధిత అధికారులు రంగంలోకి దిగి.. మొసలి లాక్కెళ్లిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు వ్యక్తి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోటాకు సమీపంలోని ఖటోలి పట్టణంలోని పార్వతి నదిలో స్థానిక రామ్ ఘాట్ వద్ద స్థానికులతో పాటుగా అదే పట్టణానికి చెందిన బిల్లూ అనే 38 ఏళ్ల వ్యక్తి కూడా వచ్చాడు. స్నానం చేసేందుకు అతడు నదిలోనికి దిగాడు.

అయితే ఎప్పటి నుంచో అక్కడే నక్కిన ఒ మొసలి.. అక్కడికి చేరువగా ఎవరు వస్తారా.. అని ఎదురుచూసింది. బిల్లూ నదిలోకి దిగగానే ఒక్కసారిగా అతడిపై దాడిచేసి నోట కరుచుకుని నదిలోకి లాక్కెళ్లిపోయింది. నదిలో స్నానం చేస్తున్న మిగతా వారు భయంతో ఒడ్డుకు చేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నది వద్దకు చేరుకుని బిల్లూ కోసం గాలించారు. నదిలో మొసళ్లు ఉండడంతో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, ఈ నెల మొదట్లో ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ కొలునులో స్నానం చేస్తున్న బాలుడిపై దాడిచేసిన మొసలి అతడిని చంపేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles