మద్యం సీసా వాసన చూస్తేనే ఒక చిత్రంలో హీరోకు కిక్కు ఎక్కుతుంది. ఇక అదే సరిస్థితి ఇప్పుడు తాజాగా మందుబాులకు కలుగుతుంది. ఔనా అంటారా.. మద్యం కొనుగోలు చేయడం విసయం పక్కనబెడితే.. మద్యందుకాణాలకు వెళ్లి వాటిని ఖరీదు ఎంత అని అడిగితే చాలు.. మందుబాబులకు కిక్కు ఎక్కడం గ్యారంటీ. ఎందుకంటే.. తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెంచుతూ.. కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అసలే ధనిక రాష్ట్రం అని గోప్పలు చెప్పుకున అధికార పార్టీ నేతలకు.. ధనం సమృద్దిగా లేదని మద్యం బాబులను టార్గెట్ చేసిందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేలా చేసింది.
ఇప్పటికే అర్టీసీ చార్జీలను పెంచిన ప్రభుత్వం, మరోవైపు విద్యుత్ చార్జీలను కూడా పెంచింది. ఇక తాజాగా మద్యం బాబులను కూడా టార్గెట్ చేసింది. బీరు సీసాల నుంచి క్వార్టర్, ఫుల్ సీసాల వరకు అన్ని రకాల మద్యంపై ధరలన కూడా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అంటే.. గురవారం నుంచే అమల్లోకి వస్తాయి. మద్యం దుకాణాల్లో బుధవారం అమ్మకాలు పూర్తి కాగానే అబ్కారీ అధికారులు మద్యం సీజ్ చేశారు. ఆ తర్వాత నిల్వలు లెక్కిస్తారు. అనంతరం గురువారం నుంచి.. పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకుంటారు.
ఒక్కో బీరు, క్వార్టర్ పై రూ.20 పెంటినట్టుగా తెలుస్తోంది. ఫుల్ బాటిల్ పై రూ.80 పెంచారు. ఇటీవలే.. ఆబ్కారీ శాఖ ఎండాకాలంలో మద్యం ఎంత తాగారో లెక్కలు ప్రకటించింది. తెలంగాణలో ఎప్పుడూ లేనంతగా.. బీర్లు అమ్మకాలు పెరిగాయి. ఆ లెక్కలు చూసుకుంటే..మార్చి నుంచి మే 14 వరకు అంటే 75 రోజుల్లో రూ.6,702 కోట్ల విలువైన బీర్లు తాగారు. అంటే.. 10.64 కోట్ల లీటర్ల బీర్లు అన్నమాట. 6.44 కోట్ల లీటర్ల లిక్కర్ను మద్యం ప్రియులు లాగించేశారు. ఈ రెండింటినీ పోల్చుకుంటే.. సుమారు 4 కోట్ల లీటర్ల బీరు ఎక్కువగా కుమ్మేశారు.
ఈ ధరలను చూసుకుంటే.. గతేడాది, అంతకుముందు ఏడాది కంటే అధికం. విపరీతంగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. 75 రోజుల్లో రూ.6,702 కోట్ల బీర్లు తాగేశారంటే ఒక్కసారి ఆలోచించండి. మందు బాబులు చల్లని బీరు గొంతులో ఎలా పోస్తున్నారో తెలుస్తుంది. గతంలో చల్లటివి తాగితే.. కరోనా వస్తుందనే భయంతో చాలామంది బీర్లకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఎగబడి మారి.. బీర్లు తాగుతున్నారు. పెళ్లిల్లు, పార్టీలు ఇలా అంతటా చల్లని బీర్లే గొంతులో పోస్తున్నారు. తాగేవాళ్లు ఏ ఇద్దరూ కలిసినా.. నాలుగు బీర్లు తెచ్చుకుని.. చెరో రెండు లాగించేస్తున్నారు.
వేసవి మెుదలైనప్పటి నుంచి రంగారెడ్డి జిల్లాలో అధికంగా 2.38 కోట్ల లీటర్ల బీర్లు తాగారు. తర్వాతి స్థానంలో వరంగల్ జిల్లా ఉంది. ఇక్కడ కోటి 15 లక్షల బీర్లు తాగారు. ఖమ్మం జిల్లాలో మాత్రం లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో కోటి 7 లక్షలు లీటర్లు, కరీంనగర్ జిల్లాలో కోటి 6 లక్షలు లీటర్లు, మెదక్ జిల్లాలో 92.44 లక్షలు బీర్లు తాగేశారు. హైదరాబాద్ జిల్లాలో 87.49 లక్షల లీటర్లు, మహబూబ్ నగర్ జిల్లాలో 81.22 లక్షల లీటర్లు, ఖమ్మం కేవలం 40.53 లక్షలు లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్పూర్లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more