IAS officer said ‘winds’ led to Bihar bridge collapse కేంద్రమంత్రిని అవ్వాక్కయేలా చేసిన ఐఏఎస్ అధికారి నివేదిక.!

Nitin gadkari amazed at ias officer s response to reason for bridge collapse

union minister nitin gadkari, nitin gadkari on bridge collapse, bihar bridge collapse, nitin gadkari on IAS Officer, Union minister on Bihar bridge collapse, Union Minister on IAS officer, road transport and highways Ministry, Bridge Collapse, Nitin Gadkari, Strong winds, Heavy Rains, Sultanagunj, Bhagalpur, Khagalia, IAS officer, Bihar, Crime

Union minister Nitin Gadkari said he was ‘amazed’ at the response of an IAS officer, who, the minister said, held ‘strong winds’ responsible for the collapse last month of a portion of an under-construction bridge in Bihar. “A bridge fell in Bihar. I asked my secretary about the possible reasons. He said the incident took place due to strong winds,” Gadkari, the minister for road transport and highways, said.

కేంద్రమంత్రిని అవ్వాక్కయేలా చేసిన ఐఏఎస్ అధికారి నివేదిక.!

Posted: 05/11/2022 05:56 PM IST
Nitin gadkari amazed at ias officer s response to reason for bridge collapse

బీహార్‌లోని సుల్తాన్ గంజ్‌లోని గంగా న‌దిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జ్ కుప్పకూలింది. అయితే బ్రిడ్జి కూలిపోడానికి కారణం ఏంటన్న నివేదికను అధికారులు ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి పంపారు. ఆయన ఈ నివేదికను చూసి విస్మయానికి గురయ్యారు. ఏదో గ్రామస్థాయి అధికారులో లేక మండలస్థాయి అధికారులో కాదు ఏకంగా బ్యూరోక్రాట్ గా పిలువబడే ఐఏఎస్ అధికారి ఇచ్చిన నివేదిక ఇది. ఈ నివేదికలో గంగానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణం తెలుసుకున్న కేంద్రమంత్రి అవ్వాకయ్యారు. అయితే ఈ విషయాన్ని ఆయన ఎక్కడ ప్రస్తావించాలో అక్కడ ప్రస్తావించడంతో అదికాస్తా ఇప్పుడు వైరల్ న్యూస్ గా మారింది.

సుల్తాన్‌గంజ్‌ జిల్లాలో భ‌గ‌ల్‌పూర్‌, ఖ‌గాలియాల‌ను క‌లుపుతూ గంగాన‌దిపై ఈ వంతెన‌ను నిర్మిస్తున్నారు. రూ. 1710 కోట్ల అంచ‌నా వ్య‌యంతో 2014లో దీన్ని ప్రారంభించారు. 2019 ఈ నిర్మాణం పూర్తి కావాల్సి ఉండ‌గా, క‌రోనా స‌హా వివిధ కార‌ణాల వ‌ల్ల అది ఆల‌స్య‌మ‌వుతోంది. దీనికి కార‌ణాల‌ను కేంద్ర ర‌హ‌దారుల మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఆరా తీశారు. వంతెన కూల‌డానికి కార‌ణమేంట‌ని ఐఏఎస్ ఆధికారైన తన కార్యదర్శిని అడిగారు. దానికి ఆ సెక్ర‌ట‌రీ స‌మాధాన‌మిస్తూ.. ఆ స‌మ‌యంలో వ‌ర్షం ప‌డుతోంద‌ని, గ‌ట్టిగా గాలులు వీస్తున్నాయ‌ని, దాంతో నిర్మాణంలో ఉన్న ఆ వంతెన‌లో కొంత భాగం కూలిపోయింద‌ని నివేదికలో పేర్కోన్నారని తెలిపారు.

దీంతో విస్మయానికి గురైన ఇయన ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తపర్చారు. అయితే ఈ బ్రిడ్జి విషయాన్ని అంతటితో వదలని మంత్రి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆహుతులతో విషయాన్ని పంచుకున్నారు. వర్షం, బ‌ల‌మైన గాలులు వీస్తే బ్రిడ్జ్ ఎలా కూలుతుందో అర్థం కావ‌డం లేద‌ని మంత్రి అన్నారు. ఒక ఐఏఎస్ అధికారి ఇలా కూడా స‌మాధాన‌మిస్తారా? గ‌ట్టిగా గాలులు వీస్తే.. కాంక్రిట్ నిర్మాణం కూలిపోతుందా?`అని ప్రశ్నించారు. ఈ బ్రడ్జి కూలిపోవడానికి నిర్మాణ లోపాల‌ే కారణమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 1710 కోట్ల ఖ‌ర్చుతో నిర్మిస్తున్న‌ ఈ బ్రిడ్జ్‌ నిర్మాణం 2014లో చేపట్టగా.. 2019లో పూర్తికావాల్సివుంది. కానీ కరోనా సహా పలు కారణాలతో ఆలస్యమైంది. బ్రిడ్జి ఏకంగా 3116 మీట‌ర్లు పొడుగు ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bridge Collapse  Nitin Gadkari  Strong winds  Heavy Rains  Sultanagunj  Bhagalpur  Khagalia  IAS officer  Bihar  Crime  

Other Articles