బీహార్లోని సుల్తాన్ గంజ్లోని గంగా నదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జ్ కుప్పకూలింది. అయితే బ్రిడ్జి కూలిపోడానికి కారణం ఏంటన్న నివేదికను అధికారులు ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి పంపారు. ఆయన ఈ నివేదికను చూసి విస్మయానికి గురయ్యారు. ఏదో గ్రామస్థాయి అధికారులో లేక మండలస్థాయి అధికారులో కాదు ఏకంగా బ్యూరోక్రాట్ గా పిలువబడే ఐఏఎస్ అధికారి ఇచ్చిన నివేదిక ఇది. ఈ నివేదికలో గంగానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణం తెలుసుకున్న కేంద్రమంత్రి అవ్వాకయ్యారు. అయితే ఈ విషయాన్ని ఆయన ఎక్కడ ప్రస్తావించాలో అక్కడ ప్రస్తావించడంతో అదికాస్తా ఇప్పుడు వైరల్ న్యూస్ గా మారింది.
సుల్తాన్గంజ్ జిల్లాలో భగల్పూర్, ఖగాలియాలను కలుపుతూ గంగానదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. రూ. 1710 కోట్ల అంచనా వ్యయంతో 2014లో దీన్ని ప్రారంభించారు. 2019 ఈ నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా, కరోనా సహా వివిధ కారణాల వల్ల అది ఆలస్యమవుతోంది. దీనికి కారణాలను కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆరా తీశారు. వంతెన కూలడానికి కారణమేంటని ఐఏఎస్ ఆధికారైన తన కార్యదర్శిని అడిగారు. దానికి ఆ సెక్రటరీ సమాధానమిస్తూ.. ఆ సమయంలో వర్షం పడుతోందని, గట్టిగా గాలులు వీస్తున్నాయని, దాంతో నిర్మాణంలో ఉన్న ఆ వంతెనలో కొంత భాగం కూలిపోయిందని నివేదికలో పేర్కోన్నారని తెలిపారు.
దీంతో విస్మయానికి గురైన ఇయన ఆశ్చర్యాన్ని వ్యక్తపర్చారు. అయితే ఈ బ్రిడ్జి విషయాన్ని అంతటితో వదలని మంత్రి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆహుతులతో విషయాన్ని పంచుకున్నారు. వర్షం, బలమైన గాలులు వీస్తే బ్రిడ్జ్ ఎలా కూలుతుందో అర్థం కావడం లేదని మంత్రి అన్నారు. ఒక ఐఏఎస్ అధికారి ఇలా కూడా సమాధానమిస్తారా? గట్టిగా గాలులు వీస్తే.. కాంక్రిట్ నిర్మాణం కూలిపోతుందా?`అని ప్రశ్నించారు. ఈ బ్రడ్జి కూలిపోవడానికి నిర్మాణ లోపాలే కారణమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 1710 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం 2014లో చేపట్టగా.. 2019లో పూర్తికావాల్సివుంది. కానీ కరోనా సహా పలు కారణాలతో ఆలస్యమైంది. బ్రిడ్జి ఏకంగా 3116 మీటర్లు పొడుగు ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more