అసని తుఫాన్తో బంగాళాఖాతంలో భీకర అలజడి ఉంది. ఏపీ తీరం వెంట సముద్రం ఉప్పొంగుతోంది. అయితే ఆ తుఫాన్ ధాటికి కోస్తాంధ్రా తీరంలో ఓ వింత చోటుచేసుకుంది. ఈ వింతకు శ్రీకాకుళం జిల్లా వేదికగా నిలిచింది. తుపాను కారణంగా బంగారువర్ణంతో గల ఓ రథం శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. ఇతర దేశానికి చెందిన ఓ మందిరంగా దీనిని పేర్కోంటున్నా.. అది స్వర్ణరథంలా ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ స్వర్ణరథాన్ని స్థానికులు సముద్ర తీరం నుంచి ఒడ్డకు లాక్కుని వచ్చారు.
అసని తుపాను కారణంగా ఎంతో అలజడిగా వున్న సముద్ర తీరం.. శ్రీకాకుళంలోని సున్నాపలల్లి రేవు తీరానికి స్వర్ణరథాన్ని తీసుకువచ్చిందన్న వార్త తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో రథాన్ని చూసేందుకు వచ్చారు. సముద్రడే స్వయంగా స్వర్ణరథాన్ని సున్నాపల్లికి తీసుకువచ్చాడని భావిస్తున్న స్థానికులు.. ఆ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వున్న అక్షరాలను కూడా గుర్తించారు. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుపానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదని పేర్కోన్నారు.
కాగా ఈ స్వర్ణరథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహుశా ఆ రథం మరో దేశం నుంచి వచ్చి ఉంటుందని నౌపాడా ఎస్సై తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారులకు ఈ విషయాన్ని చెప్పామని, ఉన్నతాధికారులు దీన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తీరానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఈ రథాన్ని పెద్ద తాళ్లతో లాగుతూ ఒడ్డుకు చేర్చారు. బంగారు వర్ణంతో ఈ రథం మెరిసిపోతోంది. భారీ స్వర్ణ రథం కొట్టుకొచ్చిందన్న వార్త దవానంలా వ్యాపించడంతో దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more