ప్రజలు అనేక పనులపై బయటకు వెళ్లి సకాలంలో ఇంటికి చేరుకోలేకో.. లేక ఏదో ఒక రోజు బయటి ఆహారం తినాలని ఉందని పిల్లలు అనడంతోనో.. స్థానిక రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించుకుని తింటుంటారు. అయితే ఇకపై రెస్టారెంట్ల నుంచి ఆహారం తీసుకువచ్చారంటే ముందుగా చెక్ చేసుకున్న తరువాతే తినాలి. చిన్న పొరపాటు జరిగినా.. అది తిన్న వారు ఆనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే.. ఇలాంటి ఘటనే కేరళలోని ఓ రెస్టారెంట్ చేసింది. అయితే ఆహారాన్ని తెరచి చూసిన కస్లమర్లు దానిని గుర్తించడంతో పెనుముప్పు తొలగిపోయింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన కేరళ రాష్ట్రంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ఓ మహిళకు.. అందులో పాము చర్మం కనిపించింది. తిరువనంతపూరంలోని నెదుమంగడ్ ప్రాంతంలో ఉన్న హోటల్లో జరిగింది ఈ ఘటన. ఓ మహిళ తన కూతురితో కలిసి.. ఆ రెస్టారెంట్లో రెండు పరోటాలను కొనుగోలు చేసింది. తీరా తెరిచి చూస్తే.. పరోటాను కప్పి ఉంచిన పేపర్లో పాము చర్మం కనిపించింది. ఆ మహిళ ఒక్కసారిగా షాక్కు గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఫుడ్ సెఫ్టీ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. చివరికి ఆహార భద్రత అధికారుల వద్దకు వెళ్లి.. జరిగిన ఘటనను వివరించింది.
ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు.. ఆలస్యం చేయకుండా ఆ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. పరిస్థితి.. చాలా దారుణంగా ఉందని గమనించి, ఆ రెస్టారెంట్ను తాత్కాలికంగా మూసివేశారు. "రెస్టారెంట్లో వెంటనే తనిఖీలు చేపట్టాము. చాలా దారుణంగా ఉంది. కిచెన్లో ఆహార భద్రత ఏమాత్రం కనిపించలేదు. చెత్తను కూడా బయటే పడేస్తున్నారు. వెంటనే రెస్టారెంట్ను మూసివేశాము. కాగా.. పరోటాను కప్పిన న్యూస్పేపర్లోనే పాము చర్మం ఉన్నట్టు మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది," అని నెదుమంగడ్ ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ ఆర్షిత బషీర్ వెల్లడించారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ రెస్టారెంట్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Hotel in Kerala's Thiruvananthapuram has been temporarily shut after a customer allegedly found a part of a snake skin packed into her food. The snake skin was found in the newspaper that was used to pack the parottas, following which the food safety officials were alerted.
— Tushar Kant Naik ॐ♫₹ (@Tushar_KN) May 6, 2022
pic.twitter.com/WZXi30fVzd
(And get your daily news straight to your inbox)
Jun 27 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ... Read more
Jun 27 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని... Read more
Jun 27 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్... Read more
Jun 27 | ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి... Read more
Jun 27 | శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి..... Read more