ప్రజలు అనేక పనులపై బయటకు వెళ్లి సకాలంలో ఇంటికి చేరుకోలేకో.. లేక ఏదో ఒక రోజు బయటి ఆహారం తినాలని ఉందని పిల్లలు అనడంతోనో.. స్థానిక రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించుకుని తింటుంటారు. అయితే ఇకపై రెస్టారెంట్ల నుంచి ఆహారం తీసుకువచ్చారంటే ముందుగా చెక్ చేసుకున్న తరువాతే తినాలి. చిన్న పొరపాటు జరిగినా.. అది తిన్న వారు ఆనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే.. ఇలాంటి ఘటనే కేరళలోని ఓ రెస్టారెంట్ చేసింది. అయితే ఆహారాన్ని తెరచి చూసిన కస్లమర్లు దానిని గుర్తించడంతో పెనుముప్పు తొలగిపోయింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన కేరళ రాష్ట్రంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ఓ మహిళకు.. అందులో పాము చర్మం కనిపించింది. తిరువనంతపూరంలోని నెదుమంగడ్ ప్రాంతంలో ఉన్న హోటల్లో జరిగింది ఈ ఘటన. ఓ మహిళ తన కూతురితో కలిసి.. ఆ రెస్టారెంట్లో రెండు పరోటాలను కొనుగోలు చేసింది. తీరా తెరిచి చూస్తే.. పరోటాను కప్పి ఉంచిన పేపర్లో పాము చర్మం కనిపించింది. ఆ మహిళ ఒక్కసారిగా షాక్కు గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఫుడ్ సెఫ్టీ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. చివరికి ఆహార భద్రత అధికారుల వద్దకు వెళ్లి.. జరిగిన ఘటనను వివరించింది.
ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు.. ఆలస్యం చేయకుండా ఆ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. పరిస్థితి.. చాలా దారుణంగా ఉందని గమనించి, ఆ రెస్టారెంట్ను తాత్కాలికంగా మూసివేశారు. "రెస్టారెంట్లో వెంటనే తనిఖీలు చేపట్టాము. చాలా దారుణంగా ఉంది. కిచెన్లో ఆహార భద్రత ఏమాత్రం కనిపించలేదు. చెత్తను కూడా బయటే పడేస్తున్నారు. వెంటనే రెస్టారెంట్ను మూసివేశాము. కాగా.. పరోటాను కప్పిన న్యూస్పేపర్లోనే పాము చర్మం ఉన్నట్టు మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది," అని నెదుమంగడ్ ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ ఆర్షిత బషీర్ వెల్లడించారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ రెస్టారెంట్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Hotel in Kerala's Thiruvananthapuram has been temporarily shut after a customer allegedly found a part of a snake skin packed into her food. The snake skin was found in the newspaper that was used to pack the parottas, following which the food safety officials were alerted.
— Tushar Kant Naik ॐ♫₹ (@Tushar_KN) May 6, 2022
pic.twitter.com/WZXi30fVzd
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more