నిమ్మకాయల ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. యావత్ భారతంలోనూ ఈ పరిస్థితి అలుముకుంది. వేసవి వస్తే ఇక నిమ్మకాయలు.. గుమ్మడికాయ ధరలకు చేరడం గ్యారంటిగా మారనున్నాయి. ఇన్నాళ్లు కొన్నింటిపైనే పడిన దళారులు కన్ను ఇక సామాన్యులు తినే ఆహారపధార్థులపై కూడా పడింది. దీంతో మండుటెండల్లో నిమ్మరసం తాగడానికి కూడా సామాన్యులు జంకుతున్నారు. అటు దళారులూ కాదు ఇటు జైలు సూపరింటెండ్ కూడా ఈ పరిస్థితిన సోమ్ము చేసుకోవాలని భావించాడు. అయితే ఈ చిన్న తప్పు ఆయన మొత్తం జీతానికే ఎసురు తెచ్చింది. అంతేకాదు తన కెరీర్ లోనూ మాయని మచ్చను తెచ్చింది.
ఐపీఎస్ అధికారులే జైలు సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ స్థాయి అధికారులు చిన్నాచితక మొత్తంలో అవినీతికి పాల్పడరని ప్రభుత్వాలు నమ్ముతాయి. కానీ ప్రభుత్వాలు నమ్మకాలను వమ్ము చేస్తూ.. ఈ ఐపీఎస్ అధికారి అవినీతికి తెరలేపారు. ఇక వేసవి నేపథ్యంలో జైలులోని ఖైదీలు మండుటెండను తట్టుకుని ఉండేందుకు నిమ్మకాయలను పంచాడు. అదే అతని పదవికి ఎసరు తెచ్చింది. ఔనా నిమ్మకాయలు ఇస్తే మంచిదేగా అంటారా.? అయితే ఇస్తే బాగానే ఉండేది కానీ ఇవ్వకుండానే ఇచ్చినట్లు చె్ప్పి కుంభకోణానికి తెరలేపడంతోనే అతని ఉద్యోగానికి ఎసరు వచ్చింది.
వేసవి నేపథ్యంలో జైలులో ఖైదీలకు నిమ్మకాయలు అందిస్తున్నట్లు బిల్లులు సృష్టించాడు. డబ్బుకోసం ప్రభుత్వానికి బిల్లులు పంపించాడు. అయితే జైలులో ఉన్న ఖైదీ రాష్ట్ర మంత్రికి లేఖ రాయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంకేముంది జైలు అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుర్నమ్ లాల్.. అనే ఐపీఎస్ అధికారి పంజాబ్లోని కపుర్తల మోడర్న్ జైలు సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 15-30 తేదీల మధ్య జైలులో 50 కిలోల నిమ్మకాయలు వినియోగించామని, వాటికి కిలోకు రూ.200 చొప్పున మొత్తం రూ.10 వేలకు కొనుగోలు చేశామని ప్రభుత్వానికి బిల్లులు సమర్పించారు.
అయితే జైలు అధికారి అవినీతికి పాల్పడుతున్నాడని, తప్పుడు రేషన్ బిల్లులు ప్రభుత్వానికి పంపుతున్నాడని, ఆ బిల్లుల్లో పేర్కొన్న కూరగాయలు తమకు ఒక్కసారిగా వడ్డించలేదని రాష్ట్ర జైళ్లశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్కు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి విచారణకు ఆదేశించారు. అవన్నీ తప్పుడు బిల్లులని, అసలు జైలులో ఉన్న స్టాక్కు.. బిల్లులకు పొంతన లేదని, నిబంధనల ప్రకారం ఖైదీలకు ఆహారం అందించడం లేదని, నిమ్మకాయల కుంభకోణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో ప్రభుత్వం జైలు సూపరింటెండెంట్ గుర్నమ్ను సస్పెంట్ చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more