ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ కు సిద్దిపేట జిల్లా సరిహద్దులో ఛేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆయన సిరిసిల్లా పర్యటనకు వెళ్తానని చెప్పడంతో పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. దీంతో ఈయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తనపై దాడి చేసింది మంత్రి కేటీఆర్ మనుషులేనని, స్థానిక సిఐ, డీఎస్సీల సమక్షంలోనే ఇదంతా జరిగినా వారు వేడుక చూస్తుండిపోయారని, ఈ దాడిలో వారికి కూడా తెరవెనుక ప్రమేయముందని ఆయన అరోపించారు.
అంతేకాకుండా.. టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో 20 సీట్ల కంటే ఎక్కువ రావంటూ వ్యాఖ్యానించారు. తాను ప్రపంచ శాంతి దూతగా రాలేదని… ప్రజాశాంతి పార్టీ అధినేతగా వచ్చానని.. తెలంగాణలో ఇక కేసీఆర్ ఆటలు సాగవని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ఆగడాలు ఇక ప్రజలు కూడా సహించబోరని అన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తానని అన్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తాను మళ్లీ సిరిసిల్లకు వెళ్తానని, ఈసారి అరెస్ట్ చేస్తారా? చంపుతారా? అని ప్రశ్నించారు.
ఇటీవల తనపై జరిగిన దాడిని డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమారే చేయించారని పాల్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన బస్వాపూర్ గ్రామ రైతులు పాల్ను కలిశారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. లక్ష నుంచి రూ. 3 లక్షలు పరిహారంగా ఇవ్వాలని, అది కూడా ఐదు రోజుల్లో అందించాలని ప్రభుత్వాన్ని పాల్ డిమాండ్ చేశారు. లేదంటే ఆ పరిహారమేదో తానే అందిస్తానని పాల్ అన్నారు. ఇక తనపై దాడి గురించి ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలియలేదని, హైదరాబాద్లో ఉన్న జడ్జీలు, లాయర్లు అందరూ దీన్ని ఖండిస్తున్నారని, గవర్నర్ తమిళిసై తనపై దాడిని ఖండించినట్లు ఆయన పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more