ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ కార్యకర్త ఆయనపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ కార్యకర్త ఆయన చెంప చెళ్లుమనిపించాడు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసిన కేఏ పాల్.. వారిని పరామర్శించేందుకు సిరిసిల్ల జిల్లాకు బయలుదేరారు., సిద్దపేట జిల్లా దాటి సిరిసిల్ల జిల్లాలోనికి వెళుతుండగా, సిద్ధిపేట జిల్లా సరిహద్దులో జక్కాపూర్ వద్ద ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు.
దీంతో వాహనం దిగిన కేఏ పాల్ వారితో మాట్లాడి శాంతిపర్చేందుకు ప్రయత్నిస్తుండగా, వారిలో ఓ వ్యక్తి కేఏ పాల్ పై ఆకస్మికంగా దాడి చేశాడు. ఊహించని పరిణామంతో పాల్ దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, కేఎల్ పాల్ చెంప చెళ్లుమనిపించిన వ్యక్తిని జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తనపై దాడి జరిగిన నేపథ్యంలో కేఏ పాల్ పోలీసులపై మండిపడ్డారు. మీరు పోలీసులా? టీఆర్ఎస్ కార్యకర్తలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు జీతాలు కేటీఆర్ ఇస్తున్నారా? ప్రభుత్వం ఇస్తోందా? అంటూ ప్రశ్నించారు. రైతులను అటు మోదీ గానీ, ఇటు కేసీఆర్ గానీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
రైతుల కోసమే తాను వచ్చానని, తాను వస్తానని చెబితే వచ్చి తీరతానని కేఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. స్థానిక డీఎస్పీ నిరసనకారులను పాల్ కారుకు అడ్డుకునే ప్రయత్నాన్ని నిర్వీర్యం చేయాల్సిందిపోయి.. తాపీగా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కనిపించారు. రాజకీయ పార్టీకి చెందిన అధ్యక్షుడు పర్యటనలో నిరసనకారులు ఎదురుకాగా, ముందస్తు చర్యల్లో భాగంగా వారిని ముందుగానే అక్కడి నుంచి పంపించాల్సిన పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దాడి జరిగిందన్న విమర్శలు వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more