సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త ఎత్తులతో ప్రజలు దాచుకున్న డబ్బును కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తూనేవున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని.. దాని పలితాలతో ఇదివరకు క్యూలైన్లలో నిలబడి చెల్లించాల్సిన బిల్లులు ఇప్పుడు ఇంట్లోనే కూర్చోని ఎంచక్కా కట్టేస్తున్నామని సంతోషిస్తున్న తరుణంలో.. సైబర్ నేరగాళ్లు పొంచివున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నాము. ఇక దీనికి తోడు ఇంటర్నెట్లో వ్యక్తిగత గొప్యతా వివరాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. గూగుల్ లో తమ ఫోటో, తమ పేరు, తమ ఫోన్ నెంబరు ఇలా అన్నింటితో పాటు తమ బ్యాంకు వివరాలను కూడా కొందరు అవగాహనా రాహిత్యంతో షేర్ చేసుకుంటున్నారు.
అయితే ఇది అత్యంత ప్రమాదకరమన్న విషయం మాత్రం వారికి తెలియడం లేదు. కాసింత సమాచారం దొరికినా.. మన బ్యాంకుల్లోని డబ్బును ఖాళీ చేసేసే సైబర్ కేటుగాళ్లు మన మధ్యే తిష్టవేసుకున్నారు. పోరబాటునో, గ్రహపాటునో ఒకరికి సంబంధించిన గోప్యత సమాచారం వీరి కంటబడితే.. ఇంకేముంది.. మొత్తం ఊడ్చికెళ్లిపోతారు. అందుకనే సర్చ్ ఇంజన్ వెబ్ సైట్లలో మన వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేయడం చాలా ప్రమాదకరం. అనేక అంశాలతో ముడిపడి ఉండే ఫోన్ నెంబర్లు ఇంటర్నెట్లో పబ్లిగ్గా పేరుతో సహా దర్శనమివ్వడం దోంగలకు తాళం చెవి అప్పగించినట్టే అవుతుంది.
అందుకే... తమ సెర్చ్ ఇంజిన్ పరిధిలో ఉన్న ఫోన్ నెంబర్లను తొలగించేందుకు గూగుల్ ఎట్టకేలకు సమ్మతించింది. గతంలో గూగుల్ బ్యాంకు ఖాతాల వివరాలు, క్రెడిట్ కార్డు వివరాలు మాత్రమే తొలగించేందుకు వెసులుబాటు కల్పించింది. తమ వివరాలు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఉంటే వాటిని తొలగించాలని గూగుల్ ను కోరే వీలుండేది. ఇప్పుడా వెసులుబాటును ఫోన్ నెంబర్లు, చిరునామాల తొలగింపునకు కూడా విస్తరిస్తూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఫోన్ నెంబర్లను తొలగించాలంటూ ఇటీవల గూగుల్ కు పెద్ద సంఖ్యలో వినతులు అందాయి.
వీటిని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్ గ్లోబల్ పాలసీ విభాగం చీఫ్ మిచెల్లీ చాంగ్ వెల్లడించారు. అయితే, గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఉన్న వివరాలను మాత్రమే తాము తొలగించగలమని, ఇతర సంస్థల సెర్చ్ ఇంజిన్లలో కనిపించే వివరాలను తాము తొలగించలేమని, ఆయా వెబ్ సైట్లను సంప్రదించి తమ వివరాలు తొలగించాలని యూజర్లు కోరాలని గూగుల్ తన బ్లాగ్ లో పేర్కొంది. ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో యూజర్ల విజ్ఞప్తులను పరిశీలించిన గూగుల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more