Black Baza spotted for the first time in Telangana ఈవీ బైక్ కొన్న ఆనందం.. 24 గంటలు తిరగకుండానే విషాదం..

Electric bike battery explosion kills one injures three in vijayawada

electric bike explode, EV mobile bombs, E-bikes explode, EV bike battery exploce, Ev bike overnight charging, Electric bike accidents, Ev bike exploded in Telugu states. Nizamabad EV bike Explode, E-bike battery explosion, E-bike exploded in Vijayawada, Sivakumar killed in E-bike Explosion, EV bike explosion in Suryaraopet. electric bike battery exploded. NTR district, Vijayawada, Andhra Pradesh, Crime

The electric bikes are turning into mobile bombs. E-bikes are catching fire and exploding even when you put it on charging. The Electric bike-related accidents are now being reported from Telugu states too. Within days of the E-bike battery explosion in which a man was killed and three others wounded, a similar accident involving an E-bike took place in Vijayawada on Friday night.

ఈవీ బైక్ కొన్న ఆనందం.. 24 గంటలు తిరగకుండానే విషాదం..

Posted: 04/23/2022 11:36 AM IST
Electric bike battery explosion kills one injures three in vijayawada

దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రికల్ బైక్ లపై ప్రజలు దృష్టి మళ్లింది. పెట్రోల్ ధరలతో పోల్చితే అత్యంత చౌకగా తమ తమ గమ్యస్థానాలను చేరుకోవచ్చునని వాహనదారులు వీటిని కోనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నమోదైన బైక్ పేలుడు ఘటనలు.. ఎలక్ట్రికల్ బైక్ ప్రియులను నిలువరిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కూడా ఎలక్ట్రికల్ బైక్ తయారీ సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు.

వాహనదారుల ప్రాణాలను బైక్ హరించేలా తయారు చేస్తున్నారని ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటామని నితిన్ గడ్కారీ వార్నింగ్ ఇచ్చినా పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పురాలేదు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైకులు బాంబు పేలుళ్లను తలపించేలా చేస్తున్నాయి. ప్రజలు డబ్బులు పెట్టి మరీ బాంబులను కొనాల్సి వస్తుందని, అవి ఏ క్షణంలో ఎవరి ప్రాణాలను హరిస్తాయో కూడా తెలియని అందోళనలు నెలకొంటున్నాయి. నిన్నటి వరకు అటు తమిళనాడు, ఇటు కర్ణాటకలో పేలిన ఈవీ బైక్ లు ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా వరుస పెట్టి పేలుతున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ ఘటనను మర్చిపోకముందే.. ఆంధ్రప్రదేశ్ లో ఈవీ బైక్ పేలిన ఘటన చోటుచేసుకుంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఏపీ విజయవాడ సూర్యారావుపేట గులాబీ తోటలో విషాదం చోటు చేసుకుంది. సూర్యారావుపేటలో ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా... మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. శివకుమార్​ అనే వ్యక్తి... నిన్ననే కొత్త ఎలక్ట్రికల్‌ బైక్ కొనుగోలు చేశాడని బంధువులు తెలిపారు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో బైక్ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టగా... తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లిన స్థానికులు... వారిని రక్షించే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా శివకుమార్​ మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles