ఆదివారం రోజున శ్రీరామనవమి పర్వదినం రోజున పర్యాటక ప్రాంతాలకు వెళ్లి.. యాజమాన్యం నిర్లక్ష్యంతో కేబుల్ కార్లు ఒకదానికి మరోకటి ఢీకొనడంతో దాదాపుగా 46 గంటలుగా నింగికి నేలకు మధ్య గాల్లోనే గడిపిన బాధితులకు ఎట్టకేలకు సురక్షితంగా కిందకు చేరుకున్నారు. 46 గంటలుగా బిక్కుబిక్కుమంటూ.. తమకు సాయం చేసే అపన్నహస్తం కోసం ఎదురుచూసిన తరుణంలో చివరకు భారత వాయుసేన రంగంలోకి దిగి కేబుల్ కార్లలో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా కిందకు తీసుకువచ్చింది. దీంతో మొత్తానికి గత 28 గంటలుగా కోనసాగిన సహాయక చర్యలు ఎట్టకేలకు ముగిసాయి.
జార్ఖండ్లోని దేవ్ గఢ్ జిల్లాలో.. ప్రపంచవ్యాప్తంగా వున్న ద్వాదశ జోతిర్లింగాలలో ఒకటైన బాబా బైధన్యాధ్ దేవాలయానికి సమీపంలోని త్రికూట పర్వతాలలో, ఆ రాష్ట్ర పర్యాటకశాఖ రోవ్ వేను ఏర్పాటుచేసింది. అయితే ఈ రోప్ వే లోని రెండు కేబుల్ కార్లు ఒకదానికోకటి ఢీకోన్నాయి. ఈఘటనలో పర్యాటకుడు అక్కడికక్కడే మరణించాడు. కాగా, 12 క్యాబిన్లలోని ఏకంగా 60 మంది పర్యాటకులు ఘటన జరిగి ఆదివారం సాయంత్రం నుంచి ఇవాళ మధ్యాహ్నం దాటేంత వరకు బాధితులు గాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే ఇవాళ సహాయచర్యలు జరుగుతుండగా, ఇద్దరు పట్టుతప్పి కిందకు జారి పడిపోయారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది.
మరో ఇద్దరు పర్యాటకులు రోప్ వే మార్గంపై కేబుల్ కార్లలోనే చిక్కుకుని ఉన్నారు. వారిని కాపాడే రెస్క్యూ ఆపరేషన్ 40 గంటలుగా కొనసాగుతోంది. రెండు హెలికాఫ్టర్లు, సైనికులు చిక్కుకున్న వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆర్మీ, ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రెస్య్యూ ఆపరేషన్లో కలిసి పనిచేస్తున్నాయి. కేబుల్ కార్లలో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీళ్లను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.
#IAF has recommenced rescue operations at Deoghar ropeway early morning today.
— Indian Air Force (@IAF_MCC) April 12, 2022
Efforts are on to rescue each and every stranded person at the earliest.#HarKaamDeshKeNaam pic.twitter.com/06PTraKHBC
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more