ఆదివారం రోజున శ్రీరామనవమి పర్వదినం రోజున పర్యాటక ప్రాంతాలకు వెళ్లి.. యాజమాన్యం నిర్లక్ష్యంతో కేబుల్ కార్లు ఒకదానికి మరోకటి ఢీకొనడంతో దాదాపుగా 46 గంటలుగా నింగికి నేలకు మధ్య గాల్లోనే గడిపిన బాధితులకు ఎట్టకేలకు సురక్షితంగా కిందకు చేరుకున్నారు. 46 గంటలుగా బిక్కుబిక్కుమంటూ.. తమకు సాయం చేసే అపన్నహస్తం కోసం ఎదురుచూసిన తరుణంలో చివరకు భారత వాయుసేన రంగంలోకి దిగి కేబుల్ కార్లలో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా కిందకు తీసుకువచ్చింది. దీంతో మొత్తానికి గత 28 గంటలుగా కోనసాగిన సహాయక చర్యలు ఎట్టకేలకు ముగిసాయి.
జార్ఖండ్లోని దేవ్ గఢ్ జిల్లాలో.. ప్రపంచవ్యాప్తంగా వున్న ద్వాదశ జోతిర్లింగాలలో ఒకటైన బాబా బైధన్యాధ్ దేవాలయానికి సమీపంలోని త్రికూట పర్వతాలలో, ఆ రాష్ట్ర పర్యాటకశాఖ రోవ్ వేను ఏర్పాటుచేసింది. అయితే ఈ రోప్ వే లోని రెండు కేబుల్ కార్లు ఒకదానికోకటి ఢీకోన్నాయి. ఈఘటనలో పర్యాటకుడు అక్కడికక్కడే మరణించాడు. కాగా, 12 క్యాబిన్లలోని ఏకంగా 60 మంది పర్యాటకులు ఘటన జరిగి ఆదివారం సాయంత్రం నుంచి ఇవాళ మధ్యాహ్నం దాటేంత వరకు బాధితులు గాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే ఇవాళ సహాయచర్యలు జరుగుతుండగా, ఇద్దరు పట్టుతప్పి కిందకు జారి పడిపోయారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది.
మరో ఇద్దరు పర్యాటకులు రోప్ వే మార్గంపై కేబుల్ కార్లలోనే చిక్కుకుని ఉన్నారు. వారిని కాపాడే రెస్క్యూ ఆపరేషన్ 40 గంటలుగా కొనసాగుతోంది. రెండు హెలికాఫ్టర్లు, సైనికులు చిక్కుకున్న వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆర్మీ, ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రెస్య్యూ ఆపరేషన్లో కలిసి పనిచేస్తున్నాయి. కేబుల్ కార్లలో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీళ్లను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.
#IAF has recommenced rescue operations at Deoghar ropeway early morning today.
— Indian Air Force (@IAF_MCC) April 12, 2022
Efforts are on to rescue each and every stranded person at the earliest.#HarKaamDeshKeNaam pic.twitter.com/06PTraKHBC
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more