గుంటూరు జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి శివాలయం వద్ద కలలకం చెలరేగింది. భక్తులకు తేనీరు, అల్పాహారం తయారు చేయడంతో పాటు అన్నదానానికి భోజనాన్ని కూడా సిద్దం చేసేలా ఒప్పందం చేసుకుని శివాలయంలోని క్యాంటీన్ తీసుకున్న కాంట్రాక్టర్.. నిబంధనలకు నీళ్లు వదిలి ఆలయంలో అపశృతికి కారణమయ్యాడు. పవిత్రమైన దేవాలంయలో కోడి మాంసం వండినట్లు తెలుస్తోంది. ఇటీవలే వైసీపీకి చెందిన స్థానిక ఎంపీటీసీ భర్త ఈ క్యాంటీన్ ను లీజుకి తీసుకున్నారు. భక్తులకు ఆహార పదార్థాలతో పాటు బయట వారి నుంచి కూడా వచ్చే ఆర్డర్లు తీసుకుంటూ వాటిని కూడా ఇక్కడే సిద్దం చేస్తూ క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు.
తాజాగా ఆలయం క్యాంటీన్ లో వండిన మాంసాహారాన్ని ఆలయం నుంచి పంపించేందుకు బయటకు తీసుకురాగా.. వాసన పసిగట్టిన భక్తులు కోందరు అది మాంసాహారమని అనుమానించి చూడగా.. అందులో చికెన్ వండి తీసుకువెళ్తున్నట్లు తేలింది. దీంతో పవిత్ర ఆలయంలో మాంసాహారాన్ని వండి బయటకు క్యాటరింగ్ కు పంపిస్తున్నట్లు చెబుతున్న భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భక్తులు తమ సెల్ ఫోన్లలో కోడికూర వండి తీసుకెళ్తున్న దృశ్యాలను ఫోటోలు తీశారు. అంతేకాదు ఈ వంటకాలన్నీ సిద్దం చేసి.. తీసుకెళ్లందుకు రిక్షాలో ఏర్పాటు చేయడం కూడా ఈ ఫోటోలలో కనిపించింది.
దీంతో దేవాలయ యాజమాన్యం, దేవాదాయశాఖ అధికారులు క్యాంటీన్ను మూసివేసి చర్యలు తీసుకున్నారు. క్యాంటీన్ను సీజ్ చేశామని, అలాగే, నిర్వాహకుల లైసెన్స్ను రద్దు చేశామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్రెడ్డి మీడియాకు వివరించారు. అయితే, ఆ మాంసాహారాన్ని బయటే వండారని, ఆ ఆహార పదార్థాల వాహనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చినట్లు నిర్వాహకులు తమకు చెప్పారని చంద్రశేఖర్రెడ్డి అన్నారు. నిర్వాహకులకు ఇప్పటికే షోకాజ్ నోటీసు కూడా ఇచ్చామని చెప్పారు. మల్లేశ్వర స్వామి శివాలయం వద్ద మాంసాహారం వివాదంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వివరించారు.
క్యాంటీన్ నిర్వాహకుల నుంచి పూర్తిస్థాయిలో వివరణ తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆలయం వద్ద గతంలోనూ ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా? అన్న విషయంపై కూడా విచారిస్తున్నామని చెప్పారు. క్యాంటీన్ నిర్వహణను ఇతర మతస్థులు చేస్తున్నట్లు తమకు తెలియదని చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మరోపక్క ఆలయం వద్ద చోటు చేసుకున్న ఘనటపై హిందూ ధార్మిక సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఈవో కార్యాలయం వద్ద హిందూ సంఘాల నేతలు బైఠాయించి నినాదాలు చేశారు. దేవాలయ పవిత్రతను దెబ్బతీసేలా ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more