పెట్రోల్ ధరలు 2014లో రూ. 80కి చేరుకోగానే గగ్గోలు పెట్టిన బీజేపి శ్రేణులు.. తాము అధికారంలోకి వస్తే ఇంధన ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలను కూడా వంద రోజుల్లోకి నియంత్రించేందుకు చర్యలు చేపడతామని ఎన్నికల్లో చెప్పిన అధికారంలోకి వచ్చింది. కానీ ఆనాటి నుంచి అటు ఇంధన ధరలు, ఇటు నిత్యావసర సరుకుల ధరలను అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంధన ధరలను అప్పటితో పోల్చితే ఏకంగా లీటరుపై రూ.40 మేర పెరిగింది. కేవలం ఎనమిదేళ్లలో ఇంధన ధరలు ఈ మేర పెరగడం.. అందునా రోజువారీ పెంపుకు శ్రీకారం చుట్టి ధరల వివరాలు ప్రజలకు తెలియకుండా చేయడంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలు విమర్శలకు తావిస్తోంది.
ఇక అప్పటి మాదిరిగానే అంతర్జాతీయంగా ఇంధన ధరలు వున్నాయన్న విషయం తెలిసిందే. దీంతో ఇంత వ్యత్యాసం ఎందుకు.? ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయన్న ప్రశ్నలు కూడా వాహనదారుల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలావుండగా కేంద్రం వాహనదారులను నిట్టనిలువునా దోపిడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ భారీగానే పేలుతున్నాయి. సామాన్యుడి పరిస్థితి మీద ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 17రోజుల్లో.. 14సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోజు ఉదయాన్నే లేచి.. పెట్రోల్ ధరలు పెరిగాయన్న వార్త విని సామాన్యులు గుండెలు పట్టుకుంటున్నారు.
ఇక ఇప్పుడు.. చమురు అనేది అత్యంత విలువైన వస్తువుగా మారిపోయిందనడంలో సందేహం లేదు. ఇంతటి విలువైన వస్తువుని.. నూతనంగా పెళ్లి చేసుకుంటున్న దంపతులకు వారి స్నేహితులు కానుకగా అందించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులో చెంగల్ పట్టు జిల్లాలోని చెయ్యూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గిరీష్ కుమార్- కీర్తనకు కొన్ని రోజుల క్రితమే పెళ్లి జరిగింది. అదే సమయంలో నూతన దంపతులకు అందరు కానుకలు ఇచ్చారు. కొద్దిసేపటికి.. వారి స్నేహితులు స్టేజ్ ఎక్కారు. పెట్రోల్ బాటిల్, డీజిల్ బాటిల్ను దంపతులకు గిఫ్ట్ చేశారు. ఆ గిఫ్ట్ను చూసి తొలుత ఆ దంపతులు షాక్ అయ్యారు. చివరికి మ్యాటర్ అర్థమయ్యి.. నవ్వుతూ ఆ గిఫ్ట్లను తీసుకున్నారు.
ఈ వీడియోను ఓ నెటిజన్.. ట్విట్టర్లో షేర్ చేశారు. ఇది కాస్తా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే.. ఇలాంటి కానుకలు సరిగ్గా గత ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తరుణంలోనూ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎందుకంటే అప్పుడు కూడా ఎన్నికల ఫలితాలు వెలువడగానే దేశ ప్రజలపై వరుసగా ఇంధన భారాన్ని మోపింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో అటు కూరగాయాల ధరలకు కూడా ఆకాశాన్నంటిన తరుణంలో వధూవరులకు వారి స్నేహితులు కూరగాయలతో దండలను చేసి వరమాలగా వేసిన దృశ్యాలు కూడా నెటిజనులను ఆకర్షించాయి.
Amidst rising #PetrolDieselPriceHike, friends of the newly married couple, Girish Kumar and Keerthana decided to gift the couple One Litre #petrol and One Litre #diesel as a wedding present at their Wedding reception in Cheyyur in Chengalpattu district #FuelPriceHike pic.twitter.com/Wr3BErZUwg
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) April 7, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more