దేశంలో ఈ ఏడాది చివరి వరకు ఏ రాష్ట్ర ఎన్నికలు లేవు. దీంతో అన్ని సరుకుల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు, వంటనూనె ధరలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటి ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలకు కూడా విపరీతంగా పెరగడంతో సామాన్యులకు అవి అందకుండా పోయాయి. దేశంలో అన్నమో రామచంద్రా అంటూ అరిచే ఆర్తనాధాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రపంచలోని 116 దేశాల జాబితాలో మన దేశంలో అన్నం కోసం అంగలార్చే వారి సంఖ్య చాలా ఎక్కువని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో ఉంది.
ఈ సూచికలో 116 దేశాలు ఉంటే.. భారత్ 101వ స్థానంలో నిలిచింది. అంటే దేశంలో పేదవారి ఆకలి బాధలు అధికమయ్యాయని ఇట్టే అర్థమవుతున్నాయి. ఇది చాలదన్నట్లు వారు అనారోగ్యం బారిన పడితే చికిత్సలో భాగంగా వైద్యులు రాసిచ్చిన మందులు వేసుకోవాలంటే కూడా ఇప్పుడు పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మనిషి అనారోగ్యం బారిన పడితే వేసుకునే అత్యవసర ఔషధాల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజూవారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు పెరగనున్నట్లు జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్పీపీఏ) ప్రకటించింది. పలు మెడిసిన్స్ ధరలు 10.7 శాతం పెరగనున్నట్లు తెలిపింది.
పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్లతో సహా అవసరమైన మందుల ధరలు పెరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జ్వరం, ఇన్ఫెక్షన్స్, గుండె జబ్బులు, హైబీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా చికిత్సకు ఉపయోగించే ఔషధాల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ప్రజలు ఎక్కువగా వినియోగించే పారాసిటమాల్, ఫెనోబర్బిటోన్, అజిత్రోమైసిన్, సిఫ్రాన్, హైడ్రోక్లోరెడ్, మెట్రిండజోల్ వంటి మందుల ధరలు ప్రజలకు భారం కానున్నాయి. 2021 క్యాలెండర్ సంవత్సరం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం సవరించినట్టు ఎన్పీపీఏ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా ఔషధాల తయారీ ఖర్చులు కూడా పెరగడంతో వాటి ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more