వడ్రంగి కళాకారుడు.. రూపోందించిన ఓ ట్రెడ్ మిల్ తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి చేరింది. ఇది పూర్తిగా చెక్కతో చేసింది. ఇక దీనికి తోడు ఎలాంటి విద్యుత్ అవసరం లేని ట్రెడ్ మిల్ కావడంతో వడ్రింగి కళాకారుడి నైపుణ్యానికి మెచ్చిన కేటీఆర్.. తెలంగాణ టి వర్క్స్ శాఖ అధికారులకు అతడి ఆచూకీని కనుగొని అతడికి తగు ప్రోత్సహాం అందించాల్సిందిగా అదేశించారు. దీంతో అధికారులు అతడు ఏ జిల్లాకు చెందిన వ్యక్తో కనుగునేందుకు వేట ప్రారంభించారు. అందులోనూ స్వయంగా కేటీఆర్ తన అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడంలో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీరా చూస్తే కథలో చిన్న మెలిక ఏర్పడింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉదయాన్నే ట్రెడ్ మిల్ కోసం జిమ్ కెళ్లినా.. లేక ఇంట్లో చేసినా.. అన్ని విద్యుత్ తీసుకుని.. మోటార్ ద్వారా రూపోందించినమే. అయితే ఈ వడ్రింగి కళాకారుడు చేసిన ట్రెడ్ మిల్ మాత్రం కేవలం.. కలప ద్వారా రూపొందించింది. ఇక ఎలాంటి విద్యుత్, మోటారు వినియోగం లేకుండా అతి తేలికగా నడుపుతున్న ఒక వడ్రంగి నైపుణ్యాన్ని చూసి మంత్రి కేటీఆర్ సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తనకు ఒక నెటిజన్ ట్విట్టర్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశాడని.. అతడి ఆచూకీని కనుగుని తగిన ప్రోత్సహాన్ని కల్పించాల్సిందిగా ఆయన టీ వర్క్స్ అధికారులకు అదేశించారు.
టీవర్క్స్ అధికారులు నెటిజన్ను సంప్రదించగా... తనకు ఆ వివరాలు తెలియవని.. వాట్సాప్ ద్వారా వచ్చిన వీడియోను మంత్రి కేటీఆర్కు పంపానని తెలిపారు. దీంతో అధికారులు ఆ కళాకారుని వివరాల వేటలో పడ్డారు. అయితే ఇది రూపోందించింది తెలంగాణకు చెందిన వ్యక్తి అనుకుని ఆ నెట్ జన్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, మంత్రివర్యులు కూడా అది తెలంగాణ కళాకారుడి ప్రతిభే అని భావించి.. టీ వర్క్స్ అధికారులకు అదేశాలించారు. తీరా చూస్తే.. అది రూపోందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వడ్రండి కళాకారుడు. కలపతో ట్రెడ్ మిల్ చేసి.. అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు.
తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానికి చెందిన వడ్రంగి కళాకారుడు కడిపు శ్రీనివాస్ చెక్కలతో ట్రెడ్ మిల్ రూపొందించి అబ్బురపరిచారు. దీని తయారీకి మూడు రోజుల సమయం పట్టిందని.. రోజు వారీ పని చేసుకుంటూ ముందుగా కావలసిన టేకు చెక్కలు సిద్ధం చేసుకుని రాత్రి సమయంలో దీని రూపొందించినట్లు శ్రీనివాస్ చెప్పారు. ట్రెడ్ మిల్లు తిరగడం కోసం 60 బాల్ బేరింగ్లు ఉపయోగించానని, మొత్తంగా దీని తయారీకి రూ.12వేలు ఖర్చయిందని తెలిపారు. పరికరం పని తీరుపై వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ మెచ్చుకుని తన అకౌంట్ ద్వారా రీట్వీట్ చేయడంతో కుడిపి శ్రీనివాస్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. తెలంగాణ మంత్రులు కొందరు ఫోను చేసి వివరాలు తెలుసుకున్నారని శ్రీనివాస్ తెలిపారు.
Wow! @TWorksHyd please connect & help him scale up https://t.co/FVgeHzsQx8
— KTR (@KTRTRS) March 18, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more