పోలీసు అవతారం ఎత్తిన దొంగలు.. వ్యాపారులను బురడీ కొట్టించి ఏకంగా రూ.89 లక్షలతో ఉడాయించిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో చోటుచేసుకుంది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకున్న పోలీసులు కచ్చితంగా వీరి సమాచారం తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ లో ఈ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుల నుంచి రూ.89 లక్షలు దోచుకుని పారిపోయారు.
గుంటూరు జిల్లాలోని దుర్గి మండలానికి చెందిన ప్రకాశరావు, అజయ్ కుమార్, రామశేషయ్యలు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో నడికుడి రైల్వే జంక్షన్ కు వచ్చారు. అక్కడి నుంచి చెన్నై వెళ్లేందుకు టిక్కెట్లు తీసుకున్నారు. వీరు తమతో పాటు రెండు బ్యాగులను తీసుకొచ్చారు. ప్లాట్ ఫాం పై రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో కారులో నుంచి ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వ్యాపారుల వద్దకు వచ్చి, పోలీసులు పిలుస్తున్నారని చెప్పారు. వారిని ఏమార్చి రెండు బ్యాగులను తీసుకుని ఉడాయించారు. తేరుకున్న బాధితులు లబోదిబోమంటూ రైల్వే పోలీసులకు విషయాన్ని వివరించారు.
రెండు బ్యాగుల్లో రూ.89 లక్షలు నగదు ఉందని, తమను మాటల్లో పెట్టి, బ్యాగులు తీసుకుని పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నగదు మొత్తాన్ని వ్యాపార పనుల కోసం చెన్నై తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగిందని వాపోయారు. బాధితుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. పల్నాడు ప్రాంతంలోని పలు పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సిసిటీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల ఆనవాళ్ల కోసం ప్రయత్నిస్తునే.. వారి కోసం గాలిస్తున్నారు. తెలిసిన వ్యక్తులే దోపిడికి పాల్పడి ఉంటారని వ్యాపారులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jul 02 | దేశంలో రాష్టప్రతి ఎన్నికలకు తెర లేచిన సందర్భంలో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి కావని, రెండు సిద్దాంతాల మధ్య పోరుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కోన్నారు. దేశంలో నెలకొన్న ‘అసాధారణ... Read more
Jul 02 | భూమిపైన ఉన్న జంతుజాలంలో మనకు కనబడనవాటినే మనం గుర్తిస్తాం. కానీ మనకు తెలియని ఎన్నోరకాల జీవచరాలు భూమిపై ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇక మనకు తెలిసిన వాటిలోనూ ఎన్నో అరుదైన జీవులు వున్నాయని,... Read more
Jul 02 | రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా... Read more
Jul 02 | దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్... Read more
Jul 02 | దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల బలపర్చిన అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్... Read more