miscreants posed as policemen and duped passengers నడికుడిలో రూ.89 లక్షలో ఉడాయించిన ఆగంతకులు

Unidentified miscreants posed as policemen and duped passengers at nadikude of ap

Nadikode Junction, Nadikode railway station, Guntur, pose as cops, cash bags, Rs 89 Lakhs, passengers duped, Guntur Police, Andhra Pradesh, Crime

Six Unidentified miscreants posed as policemen and duped three bussiness man who were waiting for their train to come at Nadikude junction in Guntur district of Andhra Pradesh. They took two bags in which Rs 89 Lakhs wotth of cash was kept. Guntur Police are in search of miscreants and watching the nearby cctv footages.

పోలీసులమని ఏమార్చి.. రూ.89 లక్షలో ఉడాయించిన ఆగంతకులు

Posted: 03/08/2022 04:16 PM IST
Unidentified miscreants posed as policemen and duped passengers at nadikude of ap

పోలీసు అవతారం ఎత్తిన దొంగలు.. వ్యాపారులను బురడీ కొట్టించి ఏకంగా రూ.89 లక్షలతో ఉడాయించిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో చోటుచేసుకుంది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకున్న పోలీసులు కచ్చితంగా వీరి సమాచారం తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ లో ఈ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుల నుంచి రూ.89 లక్షలు దోచుకుని పారిపోయారు.

గుంటూరు జిల్లాలోని దుర్గి మండలానికి చెందిన ప్రకాశరావు, అజయ్ కుమార్, రామశేషయ్యలు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో నడికుడి రైల్వే జంక్షన్ కు వచ్చారు. అక్కడి నుంచి చెన్నై వెళ్లేందుకు టిక్కెట్లు తీసుకున్నారు. వీరు తమతో పాటు రెండు బ్యాగులను తీసుకొచ్చారు. ప్లాట్ ఫాం పై రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో కారులో నుంచి ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వ్యాపారుల వద్దకు వచ్చి, పోలీసులు పిలుస్తున్నారని చెప్పారు. వారిని ఏమార్చి రెండు బ్యాగులను తీసుకుని ఉడాయించారు. తేరుకున్న బాధితులు లబోదిబోమంటూ రైల్వే పోలీసులకు విషయాన్ని వివరించారు.

రెండు బ్యాగుల్లో రూ.89 లక్షలు నగదు ఉందని, తమను మాటల్లో పెట్టి, బ్యాగులు తీసుకుని పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నగదు మొత్తాన్ని వ్యాపార పనుల కోసం చెన్నై తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగిందని వాపోయారు. బాధితుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. పల్నాడు ప్రాంతంలోని పలు పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సిసిటీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల ఆనవాళ్ల కోసం ప్రయత్నిస్తునే.. వారి కోసం గాలిస్తున్నారు. తెలిసిన వ్యక్తులే దోపిడికి పాల్పడి ఉంటారని వ్యాపారులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles