TTD to resume Arjitha sevas to SriVaru in tirumala శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో ఆర్జిత సేవలు పునరుద్దరణ..

Ttd good news to devotees says srivari arjitha sevas to resume in tirumala

Tirumala, Tirupati, Tirumala Tirupati Devasthanams, TTD, TTD Board chairman, YV Subba Reddy, Sarva Darshan tickets, Seegra Darshan tickets, Arjitha Sevas, replace hotels, fast food centres, free Annaprasadam centres, Darshan tickets, Arjitha Sevas, Budget, Andhra Pradesh, Devotional

After the TTD Board chairman YV Subba Reddy shares a key decision with the officials, and now the Tirumala Tirupati Devasthanams (TTD) is planning to resume all the arjitha sevas in Physical as usally done prior to coronavirus.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో ఆర్జిత సేవలు పునరుద్దరణ..

Posted: 03/08/2022 03:13 PM IST
Ttd good news to devotees says srivari arjitha sevas to resume in tirumala

కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగు బంగారమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి భక్తులకు.. తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాలలో ఈ నెల నుంచి భక్తులకు జారీ చేసే టికెట్లను పెంచిన టీటీడీ.. తాజాగా మరో శుభవార్తను కూడా అందించనుంది. రెండేళ్ల క్రితం వరకు వున్న కోవిడ్ కు పూర్వపు పరిస్థితులను తీసుకురావాలని.. భక్తులకు స్వామిని మరింత చేరువ చేయాలన్న భావనను వ్యక్తం చేసిన దేవస్థానం బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఆ దిశగా చర్యలకు కూడా పూనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల బడ్జెట్ సమావేశంలో అధికారులతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులతోనే చర్చించిన విషయాలను తాజాగా అమలు చేస్తున్నారు.

టీటీడీ అర్జిత సేవ టికెట్ల ధరలు పెంచుతున్నారన్న అపోహ విషయంలో స్పష్టతను ఇచ్చిన ఆయన.. ఆర్జిత సేవల టికెట్ల ధరలను పెంచడం లేదని చెబుతూనే.. అసలు ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందన్న విషయమై కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే అర్జిత సేవల టికెట్ ధరలను పెంచడం బదులుగా.. ఆర్జిత సేవలను కోవిడ్ మహమ్మారికి పూర్వం ఎలా నిర్వహించామో.. అదే విధంగా తిరుమలలోనే నిర్వహించే విషయమై చర్చకు వచ్చిందని సమాచారం. అయితే తిరుమల శ్రీవారికి భక్తులకు ఇక ఆర్జిత సేవలతో పాటు ఎలక్ట్రిక్ డిప్ అర్జిత సేవలను కూడా తిరుమలలోనే కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే విధానంతోపాటు వ‌ర్చువ‌ల్ విధానాన్ని కూడా కొన‌సాగించ‌నున్న‌ట్లు టీటీడీ స్పష్టం చేసింది. వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదని పేర్కొంది. అయితే, వారికి శ్రీవారి ద‌ర్శనంతో పాటు ప్రసాదాలు అందిస్తామని తెలిపింది.  ఇక, అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్తమాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమతించనున్నట్టు వెల్ల‌డించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles