భారతీయ విద్యార్థుల పట్ల ఉక్రెయిన్ సైనికుల దాష్టీకంపై ఆ దేశ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా స్పందించారు. దీని గురించి భారతీయ అధికారుల వద్ద ఉన్న సమాచారమే తన వద్ద ఉందన్నారు. కాగా, విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తరలించడం భారత్ ప్రాధాన్యత అని తెలిపారు. అయితే యుద్ధాన్ని ఆపడం, రష్యాపై ఒత్తిడి తీసుకురావడం తమ ప్రాధాన్యత అని చెప్పారు. ఈ మేరకు భారత్ విద్యార్థులపట్ల ఉక్రెయిన్ సైనికుల దాష్టీకాన్ని ఆయన సమర్థించారు. అయితే విద్యార్థుల తరలింపు కోసం భారతీయ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. రెండు దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని ఉక్రెయిన్ రాయబారి వ్యాఖ్యానించారు.
మరోవైపు భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ సైనికులు సరిహద్దుల వద్ద ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రష్యా దాడిపట్ల భారత్ తటస్థంగా ఉండటం, ఐకరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వనందుకు భారతీయులు, భారతీయ విద్యార్థులపై ఉక్రెయిన్ సైనికులు దాష్టీకానికి దిగుతున్నారు. ఉక్రెయిన్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు. భారతదేశం రష్యా వైపు మొగ్గు చూపుతోందంటూ భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ సైనికులు హింసిస్తున్నారు. దీనిపై కొంత మంది భారతీయ విద్యార్థుల ఆవేదనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
An Indian student speaking from the Ukraine - Poland border. He is explaining that they aren’t being allowed to cross by the Ukrainians over to Poland because Indian Govt has sided with Russia in this attack. #UkraineRussiaWarpic.twitter.com/2Rsl8efqyk
— Jas Oberoi | ਜੱਸ ਓਬਰੌਏ (@iJasOberoi) February 27, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more