మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజామునుంచే భక్తుల తాకిడితో ఆలయాలు కిటకిటలాడాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే పరమశివుడు తన దర్శనం చేసుకున్న భక్తులతో పాటు ఉపవాసం, జాగరణ ఉండే భక్తులకు అభయాన్ని అందించాడు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివయ్యకు భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామునుంచే భక్తులు దైవ దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాల్లో సందడి నెలకొన్నది. రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు పరిసర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అమరావతిలోని అమరేశ్వర దేవాలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నది. మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తెల్లవారుజాము నుంచే కృష్ణానది తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. బాలచాముండిక సమేతంగా అమరేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శివక్షేత్రమైన శ్రీశైలం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివభక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. తొలుత అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, సాయంత్రం నందివాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు లింగోద్బవకాల ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి అమ్మవారిని కిరీటం అలంకరిస్తారు. అనంతరం 12 గంటలకు పరమేశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణోత్సవం జరుపుతారు.
మహా శివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలంలో పాగాలంకరణకు ప్రత్యేక విశిష్టత ఉన్నది. శైవక్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా విశిష్టసేవ శ్రీశైలజ్యోతిర్లింగమూర్తికి మూడు తరాలుగా చేపడుతున్నారు. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన ఫృధ్వీ వెంకటేశ్వర్లు అనే చేనేత కుటుంబం మూడు తరాలుగా శ్రీశైల మల్లన్నకు తలపాగాను అలంకరిస్తున్నది. ఏడాదిపాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని నేస్తారు. స్వామివారి కల్యాణం సందర్భంగా అలంకరించేందుకు ఫృధ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం ఈ తలపాగాను సోమవారం నాడు ఆలయం అధికారులకు అందజేశారు.
మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. త్రికోటేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం శివకల్యాణం నిర్వహిస్తారు. శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
(And get your daily news straight to your inbox)
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more
Aug 16 | రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దరఖాస్తులు కోరుతోంది. అప్లై చేసేందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది.... Read more